తెలంగాణ

telangana

ETV Bharat / state

వ్యక్తిగత లాభాల కోసమే సచివాలయం కూల్చుతున్నారు: రేవంత్​ రెడ్డి

సచివాలయం కూల్చివేత, కొత్త శాసనసభ నిర్మాణంపై హైదరాబాద్​ బంజారాహిల్స్​లో అఖిల పక్ష భేటీ జరిగింది. స్వలాభం కోసమే కేసీఆర్​ కొత్త నిర్మాణాలు చేపడుతున్నారని రేవంత్​రెడ్డి ఆరోపించారు.

By

Published : Jul 7, 2019, 4:12 PM IST

Updated : Jul 7, 2019, 5:14 PM IST

వ్యక్తగత లాభాల కోసమే సచివాలయం కూల్చుతున్నారు

వ్యక్తిగత నమ్మకాలకు మాత్రమే ముఖ్యమంత్రి కేసీఆర్​ ప్రాధాన్యత ఇస్తున్నారని కాంగ్రెస్​ ఎంపీ రేవంత్​రెడ్డి విమర్శించారు. సచివాలయం కూల్చివేత, కొత్త శాసనసభ నిర్మాణంపై జరిగిన అఖిల పక్ష భేటీకి ఆయన హాజరయ్యారు. వ్యక్తిగత లాభాల కోసమే అసెంబ్లీ, సచివాలయ భవనాలను కూల్చుతామంటున్నారని ధ్వజమెత్తారు. గ్రామీణ ప్రాంతాల్లో పురాతన భవనాల్లోనే పాఠశాలలు నడుస్తున్నాయన్నారు. పార్టీలకతీతంగా పోరాడితేనే కోర్టులు జోక్యం చేసుకుంటాయని రేవంత్​ తెలిపారు. సెక్షన్​ 8 కింద రాజధానిలోని భవనాల బాధ్యత గవర్నర్​దేనన్న రేవంత్​.. ఆయన స్పందించకుంటే రాజ్​భవన్​ను ముట్టడిస్తామని హెచ్చరించారు.

వ్యక్తిగత లాభాల కోసమే సచివాలయం కూల్చుతున్నారు
Last Updated : Jul 7, 2019, 5:14 PM IST

ABOUT THE AUTHOR

...view details