భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలోని తహసీల్దార్ కార్యాలయంలో ఎమ్మెల్యే హరిప్రియ కల్యాణ లక్ష్మి చెక్కులను అందజేశారు. 125 మంది లబ్ధిదారులకు కోటి ఇరవై ఐదు లక్షల విలువగల చెక్కులను పంపిణీ చేశారు.
టేకులపల్లిలో కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ
భద్రాద్రి జిల్లా టేకులపల్లి తహసీల్దార్ కార్యాలయంలో 125 మందికి కల్యాణ లక్ష్మి చెక్కులను ఎమ్మెల్యే హరిప్రియ పంపిణీ చేశారు. అనంతరం 225 పట్టాదారు పాసు పుస్తకాలు అందజేశారు.
టేకులపల్లిలో కల్యాణ లక్ష్మీ చెక్కుల పంపిణీ
అలాగే కిష్టారం గ్రామంలో 693 ఎకరాలకు 225 పట్టాదరు పాసు పుస్తకాలు హరిప్రియ అందించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ ఛైర్మన్ కోరం కనకయ్య పాల్గొన్నారు.
ఇవీ చూడండి:మగాడు గర్భం దాలుస్తాడట.. దేవుడు కొడుకును ప్రసాదిస్తాడట.!