తెలంగాణ

telangana

ETV Bharat / state

సింగరేణి.. 'మన సంక్షేమం' టెలీఫిల్మ్ ప్రారంభం​

కార్మిక, యాజమాన్య సంబంధాలను మరింత వృద్ధి చేసుకుంటూనే.. వారిని వివిధ అంశాల్లో చైతన్యపరచడానికి.. సింగరేణి కమ్యునికేషన్ సెల్ 'మన సంక్షేమం' పేరిట.. ఓ టెలీఫిల్మ్​ను నిర్మించనుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు ఏరియా జీఎం పీవీ సత్యనారాయణ.. క్లాప్​ కొట్టి చిత్ర షూటింగ్​ను మొదలు పెట్టారు.

By

Published : Mar 19, 2021, 10:23 AM IST

mana sankshemam telefilm shoot begins  in singareni
సింగరేణి.. 'మన సంక్షేమం' టెలీఫిల్మ్ ప్రారంభం​

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు ఏరియాలోని సింగరేణి కమ్యునికేషన్ సెల్ ఆధ్వర్యంలో నిర్మించబోతున్న'మన సంక్షేమం' టెలీఫిల్మ్​ను.. ఏరియా జీఎం పీవీ సత్యనారాయణ ప్రారంభించారు. యాజమాన్యం, ఉద్యోగులకు అందిస్తున్న సంక్షేమ పథకాలపై.. ఫిల్మ్​ను​ తెరకెక్కించనున్నట్లు అధికారులు వివరించారు.

ఈ కార్యక్రమంలో.. డీజీఎం సి.లక్ష్మీనారాయణ, సింగరేణి సేవా అధ్యక్షురాలు మల్లీశ్వరీ, తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:నల్గొండలో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో 10 మంది ఎలిమినేషన్

ABOUT THE AUTHOR

...view details