తెలంగాణ

telangana

By

Published : Jul 2, 2020, 3:53 PM IST

ETV Bharat / state

ఇల్లందులో మొక్కలు నాటేందుకు గుంతలు తీసే యంత్రం ప్రారంభం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో మొక్కలు నాటేందుకు గుంతలు తీసే యంత్రాన్ని ప్రారంభించారు. ఈ యంత్రాన్ని వినియోగించుకుని మున్సిపాలిటీ పరిధిలో విరివిగా మొక్కలు నాటాలని మున్సిపాలిటీ ఛైర్మన్​ డీవీ అధికారులకు సూచించారు.

drilling  Machine started in illandu for pliantation
drilling Machine started in illandu for pliantation

హరితహారం కార్యక్రమంలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో మొక్కలు నాటేందుకు గుంతలు తీసే యంత్రాన్ని పురపాలక ఛైర్మన్​ డీవీ, కమిషనర్​ శ్రీనివాస్​ రెడ్డి ప్రారంభించారు. మున్సిపాలిటీ పరిధిలోని 24 వార్డులలో విరివిగా మొక్కలు నాటటమే లక్ష్యంగా పెట్టుకున్న సిబ్బందికి గుంతలు తీయటం సమస్యగా మారింది. ఈ సమస్యను అధిగమించేందుకు డ్రిల్లింగ్​ యంత్రాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు ఛైర్మన్​ తెలిపారు. ఈ యంత్రాన్ని వినియోగించుకుని ఎక్కువ సంఖ్యలో మొక్కలు నాటి... మున్సిపాలిటీని హరితవనంగా తీర్చిదిద్దాలని సూచించారు.

ఇవీ చూడండి:రవిప్రకాశ్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ కేసు

ABOUT THE AUTHOR

...view details