తెలంగాణ

telangana

ETV Bharat / state

పంచాయతీ వనరుల వేలం పాట

ఆదిలాబాద్​లోని ఇచ్చోడలో పంచాయతీ శాఖ ఆదాయ వనరులను వేలం వేసింది. ఈ కార్యక్రమంలో గిరిజనులు ఉత్సాహంగా పాల్గొన్నారు. దాదాపు 30 లక్షల ఆదాయం పంచాయతీకి సమకూరింది.

By

Published : Apr 16, 2019, 6:52 PM IST

వనరుల వేలం పాటలో పాల్గొన్న గిరిజనులు

ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలో పంచాయతీ ఆదాయ వనరులకు సంబంధించిన సంతలు, దుకాణాలను వేలం వేశారు. వార సంత, దిన సంత, మేకల సంత, పశువుల సంతతో పాటు అద్దె గదులకు కూడావేలం పాట వేశారు. గిరిజనులు పోటాపోటీగా పాల్గొన్నారు. ఇచ్చోడ పంచాయతీకి దాదాపు 30 లక్షల వరకు ఆదాయం సమకూరింది. పంచాయతీ నిబంధన ప్రకారం మూడు దశల్లో ఈ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు.

వనరుల వేలం పాటలో పాల్గొన్న గిరిజనులు

ABOUT THE AUTHOR

...view details