తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆదివాసీల జోలికి వస్తే విప్లవమే: సోయం బాపూరావు

ఆదిలాబాద్​ జిల్లా లక్షెట్టిపేట్​లో రాయి సెంటర్​ ఆధ్వర్యంలో ఆదివాసీ ప్రజాప్రతినిధులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఆదిలాబాద్ ఎంపీ సోయం బూపూరావు, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు హాజరయ్యారు.

By

Published : Aug 21, 2019, 12:58 PM IST

ఆదివాసీల జోలికి వస్తే విప్లవమే: సోయం బాపూరావు

లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించే వరకు ఊరుకునేది లేదని ఆదిలాబాద్​ ఎంపీ సోయం బాపూరావు హెచ్చరించారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలం లక్షెట్టిపేట్​లో రాయి సెంటర్​ ఆధ్వర్యంలో ఆదివాసీ ప్రజాప్రతినిధుల సన్మాన కార్యక్రమానికి హాజరయ్యారు. డిసెంబర్ 9న దిల్లీలో నిర్వహించే సభకు పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు. పార్టీలకతీతంగా ఆదీవాసీ ఉద్యమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఉద్యమానికి సహరించని వారిని జాతి ద్రోహులుగా గుర్తించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కుతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.

ఆదివాసీల జోలికి వస్తే విప్లవమే: సోయం బాపూరావు

ABOUT THE AUTHOR

...view details