తెలంగాణ

telangana

ETV Bharat / state

ఈనాడు-ఈటీవీ ఆధ్వర్యంలో ఓటరు అవగాహన కార్యక్రమం

నిజాయతీగల నాయకున్ని ఎన్నుకోవడానికి ఇలాంటి ఓటరు అవగాహన కార్యక్రమాలు దోహదపడతాయని ఆదిలాబాద్​ జిల్లా విద్యా శాఖాధికారి తెలిపారు.

By

Published : Mar 27, 2019, 3:44 PM IST

ఓటు వినియోగంపై ఈటీవీ అవగాహన సదస్సు

ఓటు వినియోగంపై ఈటీవీ అవగాహన సదస్సు
ఓటుహక్కు వినియోగం బాధ్యతగా భావిస్తామని, ప్రజలను చైతన్య పరుస్తామని ఆదిలాబాద్ యువత చెబుతోంది. ఈనాడు-ఈటీవీ ఆధ్వర్యంలో ఓటు వినియోగం, పోలింగ్ శాతం పెంపులో యువత పాత్ర అనే అంశంపై ఆదిలాబాద్​లో అవగాహన సదస్సు జరిగింది. ఈ సదస్సుకు జిల్లా విద్యాశాఖాధికారి రవీందర్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై ఈటీవీ కృషిని కొనియాడారు. జిల్లాలో యువత ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. వారు తలుచుకుంటే ఇతరులను ప్రభావితం చేయగలరు. ఓటు వినియోగంతో పాటు, ఓటు శాతం పెంచడంలో కీలక పాత్ర పోషిస్తామని యువతీయువకులు చెప్పుకొచ్చారు.

ABOUT THE AUTHOR

...view details