తెలంగాణ

telangana

ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యేలు

By

Published : May 3, 2021, 4:55 PM IST

ఎమ్మెల్యేలు జోగురామన్న, రాథోడ్ బాపురావు.. సీఎంఆర్​ఎఫ్​ చెక్కులు పంపిణీ చేశారు. ఆదిలాబాద్, బోథ్ నియోజకవర్గ పరిధిలోని బాధితుల కుటుంబ సభ్యులకు తమ తమ క్యాంపు కార్యాలయాల్లో వాటిని అందజేశారు.

cm relief fund cheques, mla jogu ramanna, mla rathod bapurao
cm relief fund cheques, mla jogu ramanna, mla rathod bapurao

ఆదిలాబాద్, బోథ్ ఎమ్మెల్యేలు జోగురామన్న, రాథోడ్ బాపురావు తమ తమ నియోజకవర్గ పరిధిలోని బాధితులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ చేశారు. కొవిడ్ దృష్ట్యా బాధిత కుటుంబ సభ్యులకు తమ క్యాంపు కార్యాలయంలో వాటిని అందజేశారు.

ఆదిలాబాద్ ఎమ్మెల్యే 14 మందికి, బోథ్ ఎమ్మెల్యే నలుగురికి చెక్కులు అందించారు. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి కేసీఆర్​ ప్రభుత్వం అండగా నిలుస్తూ.. ప్రజల మన్ననలు పొందుతోందని వారు కొనియాడారు.

ఇదీ చూడండి:చావునైనా భరిస్తా... ఆత్మగౌరవం కోల్పోను: ఈటల రాజేందర్

ABOUT THE AUTHOR

...view details