తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఈ చెత్త ప్రకటనలేంట్రా బాబూ: సానియా

భారత్​ - పాకిస్థాన్ ప్రపంచకప్ మ్యాచ్​ సందర్భంగా వస్తున్న ప్రకటనలపై అసంతృప్తి వ్యక్తం చేసింది టెన్నిస్ స్టార్ సానియా మీర్జా. చికాకు తెప్పిస్తున్నాయంటూ ఘాటుగా ట్వీటింది.

By

Published : Jun 13, 2019, 10:58 AM IST

సానియా

భారత్ - పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ అంటే ఎప్పుడూ ఆసక్తే. ఈ నెల 16న ఇరు జట్లు ప్రపంచకప్​లో తలపడనుండగా.. కొన్ని ప్రకటనలను హల్​చల్ చేస్తున్నాయి. ఈ యాడ్స్​పై అసంతృప్తి వ్యక్తం చేసింది భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా. ప్రకటనలు చికాకు తెప్పిస్తున్నాయంటూ ఘాటుగా ట్వీట్ చేసింది.

"కొన్ని చికాకు తెప్పించే ప్రకటనలు ఇరు దేశాల్లో హల్ చల్ చేస్తున్నాయి. సీరియస్​గా చెబుతున్నాను.. చెత్త ప్రకటనలతో ఇరు దేశాల మధ్య జరిగే మ్యాచ్​కు మీరు హైప్ పెంచాల్సిన అవసరం లేదు. ఇక చాలు ఆపండి.. ఇది క్రికెట్​ మాత్రమే. అంతకంటే ఎక్కువని మీరు భావిస్తుంటే.. మిమ్మల్ని మీరు నియంత్రించుకోండి" - సానియా ట్వీట్​

భారత్​ - పాకిస్థాన్ మ్యాచ్ సందర్భంగా కొన్ని ప్రకటనలు సందడి చేస్తున్నాయి. భారత వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ రూపంతో ఓ వ్యక్తి మ్యాచ్​కు సంబంధించిన వివరాలు చెబుతున్నట్టు ఓ వీడియో విడుదల చేసింది పాక్​కు చెందిన ఓ ఛానెల్. అలాగే భారత్​లోనూ ఓ వీడియో వైరల్​ అవుతోంది. అందులో పాకిస్థాన్ ఓడిపోయిన విధానాన్ని వివరించారు.

ఇది చదవండి: ప్రపంచకప్​ తర్వాత మరో 45 రోజులు కోచ్​ రవిశాస్త్రే

ABOUT THE AUTHOR

...view details