తెలంగాణ

telangana

డేవిస్ కప్​ వేదికపై నవంబర్ 4న సమీక్ష

By

Published : Sep 13, 2019, 7:47 PM IST

Updated : Sep 30, 2019, 12:06 PM IST

భారత్- పాకిస్థాన్ మధ్య జరగాల్సిన డేవిస్ కప్ టై మ్యాచ్​ల తేదీలను భారత టెన్నిస్ సంఘం ప్రకటించింది. నవంబర్​ 29, 30 లేదా నవంబర్ 30, డిసెంబర్ 1న జరుగుతాయని తెలిపింది. నవంబర్ 4న వేదికపై సమీక్ష నిర్వహిస్తామని స్పష్టం చేసింది.

టెన్నిస్

నవంబర్​ 29,30 లేదా నవంబర్ 30 డిసెంబర్ 1తేదీలలో భారత్​-పాకిస్థాన్ మధ్య డేవిస్ కప్ టై మ్యాచ్​లు జరుగుతాయని భారత టెన్నిస్ సంఘం ప్రకటించింది. మ్యాచ్​లు ఇస్లామాబాద్ వేదికగా జరుగుతాయా లేక తటస్థ వేదికలో జరుగుతాయా అన్నది నవంబర్ 4న తెలుస్తుందని తెలిపింది. ఆరోజు సెక్యురిటీ విషయాలపై సమీక్ష జరుపుతామని స్పష్టం చేసింది.

ప్రస్తుతం ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతిన్నాయని ఇప్పటికే అంతర్జాతీయ టెన్నిస్ ఫెడరేషన్​కు లేఖ రాసిన భారత టెన్నిస్ సమాఖ్య మ్యాచ్​లు తటస్థ వేదికకు మార్చాలంటూ సూచించింది.

గతంలో భారత టెన్నిస్​ సంఘం వేదిక మార్చాలని కోరగా.. ఆ అభ్యర్థనను తిరస్కరించింది ఐటీఎఫ్​. ఇటీవల భారత ఆటగాళ్లు తమ భద్రతపై భయాందోళనలు వ్యక్తం చేశారు.

ఇప్పటికే ఈ టోర్నీ కోసం మహేశ్​ భూపతి సారథ్యంలో ఆరుగురు ఆటగాళ్ల జట్టును ప్రకటించింది భారత టెన్నిస్​ సంఘం.

ఇవీ చూడండి.. ఈసీబీ క్రికెట్ కమిటీ ఛైర్మన్​​గా ఆండ్రూ స్ట్రాస్

Last Updated : Sep 30, 2019, 12:06 PM IST

ABOUT THE AUTHOR

...view details