తెలంగాణ

telangana

By

Published : Oct 31, 2019, 2:10 PM IST

ETV Bharat / sports

ఒలింపిక్ టెస్టు ఈవెంట్​లో శివథాపా, పూజలకు స్వర్ణం

ఒలింపిక్ టెస్టు ఈవెంట్​లో భారత బాక్సర్లు శివథాపా, పూజా రాణి స్వర్ణాలు సాధించారు. 63 కేజీల విభాగంలో థాపా, 75 కేజీల విభాగంలో పూజ పసిడితో మెరిశారు. ఆశిష్​ రజతంతో ఆకట్టుకున్నాడు.

శివ

జపాన్ టోక్యో వేదికగా జరుగుతున్న ఒలింపిక్ టెస్టు ఈవెంట్​లో భారత బాక్సర్లు సత్తాచాటారు. గురువారం జరిగిన ఫైనల్లో శివథాపా, పుజా రాణి ప్రత్యర్థులను ఓడించి స్వర్ణాలు కైవసం చేసుకున్నారు.

పురుషుల 63 కేజీల విభాగం ఫైనల్లో కజకిస్థాన్​కు చెందిన సనతాలి టొల్టయేవ్​పై 5-0 తేడాతో గెలిచి స్వర్ణం సాధించాడు శివథాపా. 75 కేజీల విభాగంలో పూజారాణి ఆస్ట్రేలియా బాక్సర్​ కైత్లిన్ పార్కర్​పై విజయం సాధించి పసిడిని ఒడిసిపట్టుకుంది.

వీరిద్దరితో పాటు ఫైనల్ చేరిన ఆశిష్ (69కేజీ) జపాన్​కు చెందిన ఒకజావా చేతిలో ఓడి రజతంతో ఆకట్టుకున్నాడు.

బుధవారం జరిగిన సెమీఫైనల్ మ్యాచ్​ల్లో ఓడి నిఖత్ జరీన్ (51కేజీ), సిమ్రన్​జీత్ కౌర్ (60కేజీ), సుమిత్ సంగ్వాన్ (91కేజీ), వాలింపుయా (75కేజీ) కాంస్యాలతో సరిపెట్టుకున్నారు.

ఇవీ చూడండి.. ఇంగ్లాండ్ క్రికెట్​ జట్టుకు మహిళా కోచ్

ABOUT THE AUTHOR

...view details