తెలంగాణ

telangana

By

Published : Dec 28, 2019, 12:55 PM IST

ETV Bharat / sports

నిఖత్​పై మేరీదే పైచేయి.. ఒలింపిక్స్​ బెర్తు ఖరారు

ఒలింపిక్స్ అర్హత పోటీల కోసం నిర్వహించిన ట్రయల్స్​లో హైదరాబాదీ బాక్సర్​ నిఖత్ జరీన్​పై మేరీకోమ్ ఘనవిజయం సాధించింది. ఫలితంగా ఒలింపిక్స్​కు బెర్తు ఖరారు చేసుకుంది.

Mary Kom
మేరీ

భారత స్టార్ బాక్సర్ మేరీ కోమ్ - నిఖత్ జరీన్ మధ్య జరిగిన ఒలింపిక్ ట్రయల్స్​ పోరులో మేరీ సులువుగా గెలిచింది. ఒలింపిక్స్ అర్హత పోటీల కోసం 51 కేజీల విభాగంలో నిర్వహించిన ట్రయల్స్​లో హైదరాబాదీ బాక్సర్ జరీన్ 1-9 తేడాతో ఓడిపోయింది. ఫలింతగా మేరీకోమ్​ వచ్చే ఏడాది టోక్యో ఒలింపిక్స్​కు అర్హత సాధించింది.

ఒలింపిక్స్ అర్హత పోటీలకు ట్రయల్స్ నిర్వహించాలని హైదరాబాదీ బాక్సర్ నిఖత్ జరీన్..​ కొన్ని రోజుల క్రితం డిమాండ్ చేసింది. ఈ మేరకు రెండు రోజులు పాటు ఈ పోటీలను నిర్వహించింది భారత బాక్సింగ్ ఫెడరేషన్​. 51, 57, 60, 69, 75 కేజీల విభాగాల్లో ఈ ట్రయల్స్​ జరుగుతున్నాయి.

ABOUT THE AUTHOR

...view details