తెలంగాణ

telangana

షూటింగ్​ ప్రపంచకప్​లో మను-సౌరభ్​ జోడీకి స్వర్ణం

By

Published : Sep 3, 2019, 8:24 AM IST

Updated : Sep 29, 2019, 6:17 AM IST

బ్రెజిల్​లో జరిగిన ఐఎస్​ఎస్​ఎఫ్​ షూటింగ్ ప్రపంచకప్​లో మొత్తంగా 9 పతకాలు సాధించి టోర్నీని ఘనంగా ముగించింది భారత జట్టు. మను-సౌరభ్​ జోడీ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో స్వర్ణం సాధించింది.​

షూటింగ్​ ప్రపంచకప్​లో మను-సౌరభ్​ జోడికి స్వర్ణం

రియో డీ జెనరో వేదికగా జరిగిన ఐఎస్​ఎస్ఎఫ్ షూటింగ్ ప్రపంచకప్​ను ఘనంగా ముగించింది భారత జట్టు. మొత్తంగా 9 పతకాలు కొల్లగొట్టింది. ఇందులో 5 బంగారు, 2 రజతం, 2 కాంస్య పతకాలు ఉన్నాయి.

ఆదివారం జరిగిన 10 మీటర్ల ఎయిర్​ పిస్టల్​ మిక్స్​డ్ విభాగంలో మనుబాకర్-సౌరభ్ చౌదరి జోడీ.. భారత్​కే చెందిన యశస్వినీ దేశవాల్​​-అభిషేక్​ వర్మ జోడీని ఓడించి స్వర్ణం చేజిక్కించుకుంది. అభిషేక్​-యశస్వినీలకు రజతం దక్కింది.

షూటింగ్ ప్రపంచకప్​లో పతకాలతో భారత్​ షూటర్లు

అంతకు ముందు ఎయిర్​ రైఫిల్ విభాగంలో అపూర్వి చండేలా-దీపక్​ కుమార్​ జోడీ స్వర్ణం సాధించింది. ఇదే టోర్నీలో గత రెండు ప్రపంచకప్​లలో పతకాలు గెల్చుకున్న భారత​ ద్వయం అంజుమ్​ మౌడ్గిల్- దివ్యాన్ష్.. ఎయిర్​ రైఫిల్​ మిక్స్​డ్​ విభాగంలో కాంస్య పతకం సాధించింది.​

ఇది చదవండి: భారత్​ జోరుకు విండీస్​​ విలవిల- సిరీస్​ కైవసం

Last Updated : Sep 29, 2019, 6:17 AM IST

ABOUT THE AUTHOR

...view details