తెలంగాణ

telangana

By

Published : Aug 11, 2019, 9:26 AM IST

ETV Bharat / sports

పాక్​ను కొట్టేసి.. చరిత్ర సృష్టించిన భారత్​

భారత పురుషుల వాలీబాల్‌ జట్టు అరుదైన రికార్డు సృష్టించింది. మయన్మార్​ వేదికగా జరుగుతోన్న ఆసియా అండర్‌-23 ఛాంపియన్‌షిప్‌లో తొలిసారి ఫైనల్‌ చేరింది. శనివారం జరిగిన సెమీస్​ మ్యాచ్​లో పాకిస్థాన్​పై విజయం సాధించింది.

పాక్​ను ఓడించి టైటిల్​ రేసులో భారత​ జట్టు

ఆసియా పురుషుల అండర్​-23 వాలీబాల్​ ఛాంపియన్​షిప్ గెలిచేందుకు అడుగుదూరంలో నిలిచింది భారత జట్టు. మయన్మార్​ వేదికగా శనివారం జరిగిన సెమీఫైనల్లో పాకిస్థాన్‌ను మట్టికరిపించింది. హోరాహోరీగా సాగిన ఆటలో 21-25తో తొలి సెట్​ కోల్పోయిన ఇండియా... 25-16, 25-22, 25-18 తేడాతో వరుస సెట్లలో పాక్‌ను ఓడించింది. ఫలితంగా తొలిసారి ఈ టోర్నీలో ఫైనల్​ చేరింది.

ఆదివారం జరగనున్న ఫైనల్లో చైనీస్‌ తైపీని ఢీకొనబోతుంది భారత వాలీబాల్​ జట్టు. సెమీస్‌లో 3-2తో జపాన్‌ను ఓడించిన తైపీ తుది సమరానికి అర్హత సాధించింది. ఈ టోర్నీలో ఫైనల్‌ చేరడం ద్వారా భారత్‌.. ఎఫ్‌ఐవీబీ ప్రపంచ పురుషుల అండర్‌-23 ఛాంపియన్‌షిప్‌కు అర్హత సాధించింది.

ఇవీ చూడండి...'తిబిలిసి గ్రాండ్​ ప్రీ'లో భజరంగ్​ భళా

ABOUT THE AUTHOR

...view details