తెలంగాణ

telangana

ఫైనల్​ నుంచి తప్పుకున్న భారత రెజ్లర్..!

By

Published : Sep 22, 2019, 2:40 PM IST

Updated : Oct 1, 2019, 2:01 PM IST

రెజ్లింగ్​ ఛాంపియన్​షిప్​లో భారత రెజ్లర్​ దీపక్ పునియా వెండి పతకంతో సరిపెట్టుకున్నాడు. గాయం బాధిస్తోందని తుదిపోరు నుంచి స్వచ్ఛందంగా తప్పుకున్నాడు. టోక్యో ఒలింపిక్స్​ బెర్తును ఇప్పటికే ఖరారు చేసుకున్నాడు దీపక్.

భారత రెజ్లర్​ దీపక్ పునియా

భారత యువరెజ్లర్ దీపక్ పునియా(86 కిలోల విభాగం).. ప్రపంచ రెజ్లింగ్​ ఛాంపియన్​షిప్​ నుంచి వైదొలిగాడు. గాయం ఇబ్బంది పెడుతోందని స్వచ్ఛందంగా తప్పుకున్నాడు. రజతంతో సరిపెట్టుకున్నాడు.ఆదివారం జరగాల్సిన తుదిపోరులో ఇరాన్​కు చెందిన హజ్సన్ యజ్దానితో తలపడాల్సి ఉంది. కానీ తను ఆడే పరిస్థితుల్లో లేనని చెప్పాడు.

భారత రెజ్లర్ దీపక్ పునియా

"స్వర్ణం కోసం ఫైట్​ చేయలేకపోవడం బాధగా ఉంది. టోక్యో ఒలింపిక్స్ పతకంపైనే ఇక నా గురి. నా ఎడమ పాదం నొప్పిగా ఉండటం వల్ల, ఈ స్థితిలో ఆడటం కష్టమైంది. నాకు తెలుసు ఇది చాలా మంచి అవకాశమని, కానీ నేనేం చేయలేకపోయాను" -దీపక్, భారత రెజ్లర్

సెమీస్​లో స్టెఫన్​ రీచ్​ముత్​తో జరిగిన మ్యాచ్​లో గాయపడ్డాడు దీపక్. అయినప్పటికీ ఆ పోరులో 8-2 తేడాతో విజయం సాధించాడు. గతేడాది జూనియర్ విభాగంలో ప్రపంచ ఛాంపియన్​షిప్ టైటిల్​ను దక్కించుకున్నాడీ రెజ్లర్. భారత్​ తరఫున సుశీల్ కుమార్(2010- 66 కిలోల విభాగం) మాత్రమే ఈ టోర్నీ​లో స్వర్ణం సొంతం చేసుకున్నాడు.

ఇవీ చదవండి:

Last Updated : Oct 1, 2019, 2:01 PM IST

ABOUT THE AUTHOR

...view details