ర్యాపిడ్ చెస్ ప్రపంచ ఛాంపియన్, తెలుగు తేజం కోనేరు హంపిని దేశ అత్యున్నత క్రీడా పురస్కారం ఖేల్రత్నకు నామినేట్ చేసింది అఖిల భారత చెస్ సమాఖ్య. గతేడాది ఆన్లైన్లో జరిగిన చెస్ ఒలింపియాడ్లో విజేతగా నిలిచిన భారత జట్టులో సభ్యురాలు హంపి. ప్రస్తుతం ప్రపంచ ర్యాంకింగ్స్లో మూడో స్థానంలో కొనసాగుతోందీ క్రీడాకారిణి. ఇప్పటికే హంపి అర్జునతో పాటు పద్మశ్రీ అవార్డులను అందుకుంది.
ఖేల్రత్న పోటీలో తెలుగమ్మాయి కోనేరు హంపి
తెలుగమ్మాయి, ప్రపంచ ఛాంపియన్ కోనేరు హంపిని ప్రతిష్ఠాత్మక ఖేల్రత్న పురస్కారానికి నామినేట్ చేసింది చెస్ సమాఖ్య. మరో ఏడుగురి పేర్లను అర్జున అవార్డుకు సిఫార్సు చేసింది.
కోనేరు హంపి
అలాగే విదిత్ గుజ్రాతి, ఆదిబన్, ఎస్పీ సేతురామన్, లలిత్ బాబు, భక్తి కులకర్ణి, పద్మిని రౌత్లను అర్జున అవార్డు కోసం సిఫార్సు చేసింది చెస్ సమాఖ్య. గతేడాది ఒలింపియాడ్లో విజేతగా నిలిచిన భారత జట్టుకు కెప్టెన్గా వ్యవహరించాడు గుజ్రాతి.