Womens Premier League 2024 Auction : మహిళల ప్రీమియర్ లీగ్- డబ్ల్యూపీఎల్ వేలానికి సమయం దగ్గరపడుతోంది. ఈ టోర్నీ రెండో ఎడిషన్ వేలానికి ఇంకా వారం రోజులు మాత్రమే ఉంది. దీంతో ఐదు ఫ్రాంచైజీలు క్రికెటర్ల ఎంపికపై కసరత్తు చేస్తున్నాయి. ముంబయి వేదికగా ఈ నెల 9న జరిగే డబ్ల్యూపీఎల్ వేలంలో 165 మంది ప్లేయర్లు పాల్గొంటున్నారు. అందులో 104 మంది భారతీయులు, 61 మంది విదేశీ క్రికెటర్లు ఉన్నారు. ఇక 15 మంది అసోసియేట్ దేశాల ప్లేయర్లు ఉన్నారు. ఈ 165 ప్లేయర్లలో 56 మంది క్యాప్డ్, 109 మంది అన్క్యాప్డ్ ప్లేయర్లు ఉన్నారని భారత క్రికెట్ నియంత్రణ బోర్డు- బీసీసీఐ శనివారం ఓ ప్రకటనలో తెలిపింది. అయితే ఐదు టీమ్లలో 30 స్లాట్లు మాత్రమే ఉండగా అందులో విదేశీ ప్లేయర్లకు 9 స్థానాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో డబ్ల్యూపీఎల్ ఆడే అదృష్టం ఎవరిని వరిస్తుందో అని ఆసక్తి నెలకొంది.
అయితే అత్యధిక కనీస ధర రూ.50 లక్షలతో వెస్టిండీస్ మాజీ ఆల్రౌండర్ డియాండ్ర డాటిన్, ఆస్ట్రేలియా ప్లేయర్ కిమ్ గార్త్ తమ పేర్లు రిజిస్టర్ చేసుకున్నారు. ఇక రూ.40 లక్షల కనీస ధరకు ఆసీస్ ఆల్రౌండర్లు అనాబెల్ సథర్లాండ్, జార్జియా వరేహం, సౌతాఫ్రికా బౌలర్ షబ్నిం ఇస్మాయిల్, ఇంగ్లండ్ వికెట్ కీపర్ అమీ జోన్స్ తమ పేర్లను వేలంలో నమోదు చేసుకున్నారు. ఇక మిగతా ప్లేయర్లు రూ.10 లక్షల నుంచి రూ.30 లక్షల కనీస ధరతో వేలంలో అదృష్టం పరీక్షించుకోనున్నారు.
ఐదు ఫ్రాంచైజీల వద్ద ఉన్న పర్స్ విలువ, స్లాట్ల వివరాలు :
దిల్లీ క్యాపిటల్స్
- పర్స్ వాల్యూ - రూ.2.25కోట్లు
- మిగిలిన స్లాట్లు - 3
- విదేశీ స్లాట్లు - 1
గుజరాత్ జెయింట్స్
- పర్స్ వాల్యూ - రూ.5.95 కోట్లు
- మిగిలిన స్లాట్లు - 10
- విదేశీ స్లాట్లు - 3