తెలంగాణ

telangana

By

Published : Feb 3, 2022, 2:16 AM IST

ETV Bharat / sports

Under 19 World Cup: ఆస్ట్రేలియాపై ఘన విజయం- ఎనిమిదోసారి ఫైనల్​కు భారత్​

Under 19 World cup 2022: అండర్‌-19 ప్రపంచకప్‌లో భారత​ జట్టు ఫైనల్​కు చేరింది. ఆస్ట్రేలియాపై 96 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి ఎనిమిదోసారి ​ఫైనల్లో అడుగు పెట్టింది. కెప్టెన్ యష్ దుల్(110) అద్భుతమైన సెంచరీతో మెప్పించాడు.

Under 19 World Cup
Under 19 World Cup

Under 19 World cup 2022: అండర్‌-19 ప్రపంచకప్‌ ఫైనల్‌కు యువభారత్‌ దూసుకెళ్లింది. ఈ టోర్నీలో ఓటమన్నదే ఎరుగకుండా జోరుకొనసాగిస్తున్న భారత్‌.. అంటిగ్వా వేదికగా జరిగిన సెమీస్‌లో ఆస్ట్రేలియాను 96 పరుగుల తేడాతో ఓడించింది. దీంతో ఎనిమిదోసారి ఫైనల్​కు చేరింది టీమ్​ఇండియా. నిర్ణీత ఓవర్ల భారత్​ నిర్దేశించి 290 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఆసీస్​ చతికిలపడింది. 41.5 ఓవర్లో 194 పరుగులకే ఆలౌట్​ అయింది. లచ్లాన్​ షా (51), కోరీ మిల్లర్​(38) మినహా మిగిన బ్యాటర్లు తక్కువ వ్యక్తిగత స్కోరుకే వెనుదిరిగారు. భారత బౌలర్లు విక్కీ ఓస్వాల్‌ మూడు, రవికుమార్‌, నిషాంత్‌ సింధు తలో రెండు వికెట్లు తీశారు.

అదరగొట్టిన కుర్రాళ్లు

తొలుత బ్యాటింగ్​ చేసిన టీమ్​ఇండియా కుర్రాళ్లు ఆకట్టుకునే ప్రదర్శన చేశారు. కెప్టెన్‌ యష్‌ధూల్‌(110), వైస్‌కెప్టెన్‌ షేక్‌ రషీద్‌(94) వీరవిహారం చేశారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్​కు దిగిన భారత్​కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. జట్టు స్కోరు 16 పరుగుల దగ్గర రఘువంశీ(6) తొలి వికెట్​గా వెనుదిరిగాడు. ఆ తర్వాత హర్నూర్ సింగ్(16), రాజవర్ధన్ 13, షేక్ రషీద్ 94 పరుగులతో స్కోరుకు బలమైన పునాది వేశాడు. ఆసీస్ బౌలర్లలో జాక్ నిష్బత్, విలియమ్ షల్జమన్ తలో రెండు వికెట్లు తీశారు.

ఇదీ చూడండి:టీమ్​ఇండియాకు ఎదురుదెబ్బ.. ముగ్గురు క్రికెటర్లకు కొవిడ్!

ABOUT THE AUTHOR

...view details