తెలంగాణ

telangana

ఐసీసీ 'క్రికెటర్​ ఆఫ్​ ది ఇయర్' రేసులో మంధాన

By

Published : Dec 31, 2021, 8:17 PM IST

Smriti Mandhana: ఐసీసీ మహిళా క్రికెటర్​ ఆఫ్​ ది ఇయర్​ అవార్డు రేసులో నిలిచింది భారత స్టార్​ బ్యాటర్ స్మృతి మంధాన. ఐసీసీ మెన్​ క్రికెటర్​ ఆఫ్​ ది ఇయర్​ జాబితాలో టీమ్​ఇండియా నుంచి ఏ ఒక్క క్రికెటర్​కూ చోటు దక్కలేదు. ఈ రేసులో ఇంగ్లాండ్ సారథి జో రూట్, న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఉన్నారు.

Smriti Mandhana
స్మృతి మంధాన

Smriti Mandhana: ఐసీసీ మహిళా క్రికెటర్​ ఆఫ్​ ది ఇయర్​ అవార్డుకు నామినేట్​ అయింది టీమ్​ఇండియా స్టార్​ బ్యాటర్​ స్మృతి మంధాన. అన్ని ఫార్మాట్లలో అదిరిపోయే ప్రదర్శన చేసినందువల్ల ఈ రేసులో నిలిచింది స్మృతి. 'టీ20 క్రికెటర్​ ఆఫ్​ ది ఇయర్​' అవార్డుకూ గురువారం ఆమె నామినేట్​ కావడం విశేషం.

స్మృతి మంధాన

2021లో అన్ని ఫార్మాట్లలో కలిపి 22 అంతర్జాతీయ మ్యాచుల్లో 38.86 సగటుతో 855 పరుగులు చేసింది స్మృతి. అందులో ఒక సెంచరీ సహా ఐదు అర్ధ శతకాలున్నాయి. స్మృతితో పాటు టామీ బ్యూమంట్ (ఇంగ్లాండ్), లీజెల్ లీ (దక్షిణాఫ్రికా), గాబీ లూయిస్ (ఐర్లాండ్).. మహిళా క్రికెటర్​ ఆఫ్ ది ఇయర్​ రేసులో ఉన్నారు. విజేతను జనవరి 23న ప్రకటించనున్నారు.

ఐసీసీ మహిళా క్రికెటర్​ ఆఫ్​ ది ఇయర్​ నామినీస్

పురుషుల రేసులో వీరే..

ఐసీసీ 'మెన్స్​ క్రికెటర్​ ఆఫ్ ది ఇయర్' రేసులో టీమ్​ఇండియా క్రికెటర్లకు చోటు దక్కలేదు. ఈ అవార్డు కోసం ఇంగ్లాండ్​ కెప్టెన్ జో రూట్, న్యూజిలాండ్ సారథి కేన్ విలియమ్సన్, పాకిస్థాన్ ద్వయం షహీన్ షా అఫ్రిది, మహ్మద్ రిజ్వాన్ పోటీ పడుతున్నారు. అన్ని ఫార్మాట్లలో అద్భుత ప్రదర్శన చేసినవారికి ఈ అవార్డు దక్కుతుంది. జనవరి 24న విజేతను ప్రకటించనున్నారు.

ఐసీసీ 'మెన్స్​ క్రికెటర్​ ఆఫ్ ది ఇయర్' నామినీస్

ఇదీ చూడండి:టీమ్ఇండియా ప్లేయర్లకు ఏమైంది?.. ఆ రేసులోనూ లేరే

ABOUT THE AUTHOR

...view details