ప్రస్తుత పరిస్థితుల్లో భారత్లో టీ20 ప్రపంచకప్ ఆడటం కష్టమేనని చెన్నె సూపర్కింగ్స్ బ్యాటింగ్ కోచ్ మైక్ హస్సీ అన్నాడు. ఐపీఎల్ కన్నా ఎక్కువ జట్లు మెగా టోర్నీలో పాల్గొనాల్సి ఉంటుందని తెలిపాడు. అలాంటప్పుడు ఎక్కువ వేదికలు అవసరమవుతాయని పేర్కొన్నాడు.
"భారత్లో టీ20 ప్రపంచకప్ ఆడటం అత్యంత కష్టమని నా అభిప్రాయం. ఐపీఎల్లో ఎనిమిది జట్లే ఉంటాయి. టీ20 ప్రపంచకప్ ఇందుకు భిన్నమేమీ కాదు. అంతకన్నా ఎక్కువ జట్లే వస్తాయి. కాబట్టి ఎక్కువ వేదికలు ఉంటాయి. ముందే చెప్పినట్టు ఒకవేళ వేర్వేరు నగరాల్లో మ్యాచ్లు ఆడితే.. ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఏదేమైనా బీసీసీఐ భారీ ప్రత్యామ్నాయ ప్రణాళికలతో ముందుకు రావాలి. యూఏఈ లేదా ఇంకేదైనా దేశంలో టీ20 ప్రపంచకప్ నిర్వహించేందుకు చూడాలి. ఎందుకంటే ప్రపంచంలోని చాలా బోర్డులు భారత్కు వెళ్లి టోర్నీ ఆడేందుకు ఆందోళన పడుతున్నాయని అనిపిస్తోంది."