తెలంగాణ

telangana

By

Published : Apr 25, 2021, 4:10 PM IST

ETV Bharat / sports

'సంజూ కెప్టెన్​గా ఉండడం వారికి ఇష్టం లేదు!'

రాజస్థాన్ జట్టు కెప్టెన్​గా యువ క్రికెటర్​ సంజూ శాంసన్​ ఉండటం ఆ టీమ్​ సహచరులకు ఇష్టం లేనట్లుందని తెలిపాడు టీమ్ఇండియా మాజీ ఓపెనర్​ వీరేంద్ర సెహ్వాగ్. ఫీల్డ్​లో, డ్రెస్సింగ్ రూమ్​లో ఆ జట్టు ఆటగాళ్ల మధ్య సమన్వయం లోపించిందని అభిప్రాయపడ్డాడు.

virendra sehwag, sanju samson
వీరేంద్ర సెహ్వాగ్, సంజూ శాంసన్

రాజస్థాన్​ రాయల్స్​ జట్టు కెప్టెన్​ సంజూ శాంసన్​పై​.. నర్మగర్భ వ్యాఖ్యలు చేశాడు మాజీ క్రికెటర్​ వీరేంద్ర సెహ్వాగ్. శాంసన్​ సారథిగా ఉండడం టీమ్ సహచరులకు ఇష్టం లేదని తాను భావిస్తున్నట్లు తెలిపాడు.

"ఆటగాడిగా ఉన్న ఓ క్రికెటర్​ కెప్టెన్​గా తనను తాను మార్చుకోవడానికి కాస్త సమయం పడుతుంది. ఫీల్డింగ్​లో ఆ జట్టు సమన్వయంతో కనిపించడం లేదు. బౌలర్ ఓ ఓవర్ చెత్తగా​ వేస్తే.. సారథిగా ఉన్న వ్యక్తి అతడితో మాట్లాడాలి. అతడిపై నమ్మకం వ్యక్తం చేయాలి. రిషభ్ పంత్​ ఇలా చేయడం నేను చూశాను. కానీ, శాంసన్ ఇలా వ్యవహరించడం లేదు. బహుశా అతడు సారథిగా ఉండడం ఆ జట్టులో ఎవరికీ ఇష్టం లేనట్లుంది."

-వీరేంద్ర సెహ్వాగ్, భారత మాజీ క్రికెటర్​.

'బ్యాటింగ్​లోనూ రాజస్థాన్​ జట్టుది ఇదే వైఖరి. విదేశీ ఆటగాళ్లు.. అందరితో కలివిడిగా ఉండట్లేదు. డ్రెస్సింగ్ రూమ్​ వాతావరణం బాగోలేదు. వారొక జట్టుగా వ్యవహరించడం లేదు' అని సెహ్వాగ్ పేర్కొన్నాడు.

ఇప్పటివరకు 5 మ్యాచ్​లాడిన రాజస్థాన్ రెండు మ్యాచ్​లు నెగ్గింది. తొలి మ్యాచ్​లో గెలుపు అంచు వరకు వచ్చి పరాజయం పాలైంది. స్టార్​ ఆటగాళ్లు జోఫ్రా ఆర్చర్​, బెన్ స్టోక్స్​ గాయాల కారణంగా ఆటకు దూరమయ్యారు. దీంతో మ్యాచ్ విన్నర్లు ఎవరనే విషయంపై ఆ టీమ్ మథనపడుతోంది. తన తదుపరి మ్యాచ్​లో ముంబయితో ఆడనుంది రాజస్థాన్​. కొత్త కెప్టెన్ మార్గదర్శకత్వంలో ఈ సారైనా రాజస్థాన్ తలరాత మారుతుందేమోనని ఫ్రాంఛైజీ ఆశగా ఎదురుచూస్తోంది. ​

ఇదీ చదవండి:మీరే కెప్టెన్​లా ముందుండి నడిపించాలి: కోహ్లీ

ABOUT THE AUTHOR

...view details