తెలంగాణ

telangana

By

Published : Apr 12, 2021, 6:12 PM IST

ETV Bharat / sports

'ఆ బౌలర్లతో బౌలింగ్ విభాగం పటిష్ఠంగా ఉంది!'

రాజస్థాన్​ రాయల్స్​తో తొలి మ్యాచ్​కు ముందు తమ బౌలింగ్ విభాగంపై సంతోషాన్ని వ్యక్తం చేశాడు పంజాబ్ కింగ్స్​ క్రికెట్ డైరెక్టర్​ అనిల్ కుంబ్లే. అత్యుత్తమ విదేశీ బౌలింగ్ వనరులు తమకున్నాయని.. ఈ సారి తొలి మ్యాచ్​ను తప్పక గెలుస్తామని ధీమా వ్యక్తం చేశాడు.​

IPL 2021: Glad to have some foreign firepower in bowling line-up, says Kumble
'విదేశీ బౌలర్లతో బౌలింగ్ విభాగం పటిష్ఠంగా ఉంది'

పంజాబ్​ కింగ్స్​ జట్టులోని విదేశీ బౌలర్ల పట్ల తానెంతో సంతృప్తిగా ఉన్నట్లు తెలిపాడు టీమ్​ డైరెక్టర్​ అనిల్​ కుంబ్లే. ప్రపంచస్థాయి బౌలర్లతో తమ టీమ్ మరింత బలంగా మారిందని అభిప్రాయపడ్డాడు.

"రాజస్థాన్​ జట్టులో మంచి ఆటగాళ్లు ఉన్నారు. వాళ్లను నిలువరించడం మాకు అవసరం. గతేడాది విజయానికి చేరువగా వచ్చాం. ఈ ఏడాది కచ్చితంగా విజయంతో లీగ్​ను ప్రారంభించాలనుకుంటున్నాం. మా జట్టులో అత్యుత్తమ విదేశీ బౌలర్లు అయిన జే రిచర్డ్​సన్, మెరిడిత్​, క్రిస్​ జోర్డాన్​ వంటి వారున్నారు. ఈ బౌలర్ల చేరికతో జట్టు బలంగా కనిపిస్తుంది. దీని పట్ల సంతోషంగా ఉన్నాం."

- అనిల్​ కుంబ్లే, పంజాబ్​ కింగ్స్​ డైరెక్టర్​

"కొన్ని వారాలుగా మాకు మంచి ప్రాక్టీస్​ లభించింది. ఇది గతేడాది ఐపీఎల్​కు ఈ సీజన్​ పొడిగింపులా అనిపిస్తుంది. లీగ్​ ఆరంభానికి ముందు చాలా ప్రయోగాలు చేశాం. ప్రాక్టీస్​ మ్యాచ్​లు కఠినంగా సాగాయి. మానసిక కోచ్ ఉండటం జట్టుకు అదనపు బలమ"ని కుంబ్లే తెలిపాడు.

గతేడాది జరిగిన ఐపీఎల్​ సీజన్​లో పంజాబ్​ జట్టు ఆరో స్థానంలో నిలిచింది. లోగోతో పాటు పేరును మార్చుకున్న ఈ జట్టు ప్రస్తుత సీజన్​లో ఎలాంటి ప్రదర్శన చేస్తుందో వేచి చూడాలి.

ఇదీ చదవండి:మనీష్​ వల్లే సన్​రైజర్స్​ ఓడిపోయింది!: సెహ్వాగ్​

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details