తెలంగాణ

telangana

By

Published : Apr 7, 2021, 6:48 PM IST

ETV Bharat / sports

విరాట్ కోహ్లీ.. ఐపీఎల్​లో ఎప్పటికీ ఆర్సీబీతోనే

కెప్టెన్ కోహ్లీ.. ఐపీఎల్​లో బెంగళూరు జట్టుతో ఉన్న బంధం గురించి వెల్లడించాడు. జట్టును వదలి వెళ్లే ఆలోచనే తనకు లేదని చెప్పాడు.

Don't see myself playing for any other IPL team: RCB skipper Virat Kohli
విరాట్ కోహ్లీ.. ఐపీఎల్​లో ఎప్పటికీ ఆర్సీబీతోనే

ఐపీఎల్​ ప్రారంభం నుంచి రాయల్ ఛాలెంజర్స్​ బెంగళూరుకు ఆడుతున్న విరాట్ కోహ్లీ.. జట్టుపై తనకున్న ప్రేమ, విధేయత గురించి చెప్పాడు. ఆర్సీబీని విడిచిపెట్టాడం, వేరే జట్టుకు ఆడటం లాంటి ఆలోచలనే తనకు లేవని అన్నాడు. ఈ విషయాన్నే చెబుతూ బెంగళురు జట్టు, కోహ్లీ ఫొటోతో ట్వీట్ చేసింది.

2008లో కుర్రాడిగా ఆర్సీబీలోకి అడుగుపెట్టిన కోహ్లీ.. ద్రవిడ్, కుంబ్లే, వెటోరి కెప్టెన్సీలో ఆడాడు. 2013లో సారథిగా బాధ్యతలుగా అందుకున్న తర్వాత నుంచి ఇప్పటికీ జట్టును నడిపిస్తూనే ఉన్నాడు. ఇప్పటివరకు మూడుసార్లు ఫైనల్​కు చేరిన బెంగళూరు.. ఒక్కసారైనా కప్పు కొట్టలేకపోయింది. ప్రస్తుత సీజన్​ ప్రారంభ మ్యాచ్​లో ముంబయి ఇండియన్స్​తో తలపడనుంది.

ఐపీఎల్​లో 192 మ్యాచ్​లాడిన కోహ్లీ.. 5878 పరుగులతో మిగతా బ్యాట్స్​మెన్​ కంటే టాప్​లో ఉన్నాడు. ఇందులో 5 సెంచరీలు, 39 అర్ధసెంచరీలు ఉన్నాయి.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details