తెలంగాణ

telangana

ETV Bharat / sports

'జాంటీ.. నీ సర్కిల్​లో నువ్వే ఉత్తమ ఫీల్డర్​'

కింగ్స్​ ఎలెవన్​ పంజాబ్​ ఫీల్డింగ్​ కోచ్​ జాంటీ రోడ్స్​పై క్రికెట్ దిగ్గజం సచిన్​ తెందూల్కర్​ ప్రశంసలు కురిపించాడు. అతడిని మైదానంలో 30 యార్డ్​ సర్కిల్​లో అత్యుత్తమ ఫీల్డర్​గా పేర్కొన్నాడు.

By

Published : Sep 28, 2020, 2:29 PM IST

Tendulkar to Rhodes
సచిన్

రాజస్థాన్​ రాయల్స్​తో జరిగిన మ్యాచ్​లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఆటగాడు నికోలస్​ పూరన్​ బౌండరీ లైన్​ వద్ద బంతిని ఆపిన విధానంపై క్రికట్​ దిగ్గజం సచిన్​ తెందూల్కర్​ ప్రశంసలు కురిపించాడు. తన జీవితంలో తాను చూసిన అత్యుత్తమ ఫీల్డింగ్ అంటూ కితాబిచ్చాడు. అయితే దీనిపై పంజాబ్ ఫీల్డింగ్ కోచ్ జాంటీ రోడ్స్ స్పందించాడు.

"క్రికెట్ దేవుడు సచిన్ మెచ్చుకున్నాక ఇందులో సందేహ పడాల్సిందేమీ లేదు. ఇదే అత్యుత్తమ ఫీల్డింగ్. అద్భుతంగా బంతి కోసం డైవ్ చేశావు నికోలస్ పూరన్. దీంతో పంజాబ్ ఫీల్డర్లలో స్పూర్తిని కలిగించావు. నేను చూసిన ఫీల్డింగ్​లో ఇదే అత్యుత్తమం" అంటూ సచిన్ ట్వీట్​కు బదులిచ్చాడు.​

ఈ క్రమంలోనే పంజాబ్​ ఫీల్డింగ్​ కోచ్​ జాంటీ రోడ్స్​ ట్వీట్​కు స్పందించిన సచిన్.. మైదానంలో 30 యార్డ్ సర్కిల్​లో అత్యుత్తమ ఫీల్డర్​గా రోడ్స్​ను పేర్కొన్నాడు.

"జాంటీ.. నేను బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ గురించి చెబుతున్నా. 30 యార్డ్ సర్కిల్​లో నువ్వే అత్యుత్తమ ఫీల్డర్​వి" అంటూ సచిన్ రిప్లై ఇచ్చాడు.

ఆదివారం జరిగిన మ్యాచ్​లో ఎనిమిదో ఓవర్​లో రాజస్థాన్​ రాయల్స్ క్రికెటర్​ సంజూ శాంసన్​ బంతిని గాల్లోకి లేపాడు. బంతి బౌండరీ లైన్​పై పడే​​ ముందు.. గాల్లోకి ఎగిరి బంతిని ఒడిసిపట్టాడు పూరన్. నేలకు తాకకముందే బంతిని తిరిగి మైదానంలోకి విసిరాడు. ఫలితంగా మాజీలు, ప్రస్తుత ఆటగాళ్లు, అభిమానుల ప్రశంసలు పొందాడీ ఆటగాడు.

ఈ మ్యాచ్​లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్​ 223 పరుగులు చేసింది. తర్వాత ఛేజింగ్​కు దిగిన రాజస్థాన్​ బ్యాటింగ్​ దూకుడుతో మ్యాచ్​ను మలుపుతిప్పింది. మూడు బంతులు మిగిలుండగానే 226 పరుగులు సాధించి లక్ష్యాన్ని ఛేదించింది.

ABOUT THE AUTHOR

...view details