తెలంగాణ

telangana

ETV Bharat / sports

దిల్లీ క్యాపిటల్స్​తో పోరుకు రాయుడు దూరం

గాయం కారణంగా ఇప్పటికే ఓ మ్యాచ్​కు దూరమైన చెన్నై జట్టు ఆటగాడు అంబటి రాయుడు మరో మ్యాచ్​కు దూరం కానున్నాడు. సెప్టెంబరు 25న దిల్లీ క్యాపిటల్స్​తో జరిగే మ్యాచ్​కు.. ఈ యువ ప్లేయర్​ అందుబాటులో ఉండడు. ఈ విషయాన్ని జట్టు సీఈఓ కాశీ విశ్వనాథన్​ తెలిపారు.

By

Published : Sep 23, 2020, 9:08 PM IST

Updated : Sep 25, 2020, 6:00 PM IST

Ambati Rayudu
రాయుడు

చెన్నై సూపర్​ కింగ్స్​కు మళ్లీ షాక్​ తగిలింది. తొలి మ్యాచ్​లో ముంబయి ఇండియన్స్​పై విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిన చెన్నై యువ ఆటగాడు అంబటి రాయుడు.. మరో మ్యాచ్​కు దూరం కానున్నాడు. ఈ విషయాన్ని జట్టు సీఈఓ కాశీ విశ్వనాథన్​ తెలిపారు.

ముంబయి ఇండియన్స్​తో ఆడిన తొలి మ్యాచులో రాయుడు గాయపడ్డాడు. తొడ కండరాలు పట్టేయడం వల్ల సెప్టెంబరు 22న రాజస్థాన్ రాయల్స్​తో జరిగిన మ్యాచ్​లోనూ ఆడలేదు. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. పూర్తి ఫిట్​నెస్​ సంపాదించుకునే వరకు రాయుడు తర్వాతి మ్యాచ్​లకు అందుబాటులో ఉండడని విశ్వనాథన్​ వెల్లడించారు. సీఎస్కే సెప్టెంబరు 25న తన తర్వాతి మ్యాచ్​లో దిల్లీ క్యాపిటల్స్​తో తలపడనుంది.

ఇదీ చూడండి 'జోఫ్రా అలా రెచ్చిపోతాడని అస్సలు ఊహించలేదు'

Last Updated : Sep 25, 2020, 6:00 PM IST

ABOUT THE AUTHOR

...view details