తెలంగాణ

telangana

By

Published : Apr 28, 2019, 10:04 PM IST

ETV Bharat / sports

ముంబయి ఇండియన్స్​ లక్ష్యం 233

ముంబయి ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా బ్యాట్స్‌మెన్‌ చెలరేగి ఆడారు. సొంత మైదానంలో బౌండరీల మోత మోగించారు. ఫలితంగా ముంబయి ముందు 233 పరుగుల భారీ లక్ష్యం ఉంచింది కోల్​కతా నైట్​రెడర్స్​ జట్టు.

ముంబయి ఇండియన్స్​ లక్ష్యం 233

ప్లేఆఫ్​ రేసులో నిలవాలంటే చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్​లో కోల్​కతా బ్యాట్స్​మెన్లు​ బౌండరీలే హద్దుగా చెలరేగారు. 20 ఓవర్లలో 232 పరుగుల భారీ పరుగులు సాధించి ఈ సీజన్​లోనే అత్యధిక స్కోరు నమోదు చేసింది నైట్​రైడర్స్​ జట్టు.

ఆరంభం అదుర్స్​...

ఓపెనర్లుగా బరిలోకి దిగిన క్రిస్​లిన్​, శుభ్​మన్​ గిల్​ ముంబయి బలమైన బౌలింగ్​ లైనప్​ను చిత్తుచిత్తు చేశారు. క్రిస్‌లిన్‌(54; 28 బంతుల్లో 7ఫోర్లు, 2సిక్సులు), శుభ్‌మన్‌గిల్‌ (76; 45 బంతుల్లో 6ఫోర్లు, 4 సిక్సులు) అర్ధ శతకాలతో రాణించారు. ఇదే క్రమంలో ఐపీఎల్​లో పదో అర్ధశతకాన్ని సాధించాడు లిన్​.

మరోసారి రసెల్​ విధ్వంసం ...

తొలి వికెట్​ తర్వాత బ్యాటింగ్​కు వచ్చిన రసెల్​ మొదట చాలా నెమ్మదిగా ఆడాడు. ఓ దశలో 14 బంతుల్లో18 పరుగులు చేసిన రసెల్...​ఇన్నింగ్స్​ ముగిసేసరికి 40 బంతుల్లో6 ఫోర్లు, 8 సిక్సులతోఏకంగా 80 పరుగులు చేసి నాటౌట్​గా నిలిచాడు. ఐపీఎల్​లో ఎనిమిదో అర్ధశతకం సాధించాడు. ఈ మ్యాచ్​లో దినేశ్​ కార్తీక్​ ఐపీఎల్​లో వంద సిక్సులు కొట్టిన ఆటగాళ్ల జాబితాలో చేరాడు.

ముంబయి బౌలర్లలో చాహర్​, హర్దిక్​ పాండ్య తలో వికెట్​ తీశారు. కృనాల్​ తప్ప మిగతాా బౌలర్లందరూ​ 10 రన్​రేట్​తో పరుగులు సమర్పించుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details