తెలంగాణ

telangana

ETV Bharat / sports

రసెల్ విధ్వంసం.. దిల్లీకి 186 పరుగుల లక్ష్యం

ఫిరోజ్ షా కోట్లా వేదికగా జరుగుతున్న మ్యాచ్​లో దిల్లీకి 186 పరుగుల లక్ష్యం నిర్దేశించింది కోల్​కతా. రసెల్ 62 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు.

By

Published : Mar 30, 2019, 10:06 PM IST

రసెల్- కార్తీక్

దిల్లీ వేదికగా అతిథ్య జట్టుతో జరుగుతున్న మ్యాచ్​లో కోల్​కతా నైట్​రైడర్స్ 185 పరుగుల స్కోరు చేసింది. కరీబియన్ వీరుడు రసెల్... మరోసారి మెరుపు ఇన్నింగ్స్​తో ఆకట్టుకున్నాడు.

టాస్ గెలిచిన దిల్లీ... కోల్​కతాకు బ్యాటింగ్ అప్పగించింది. నైట్​రైడర్స్ బ్యాట్స్​మెన్​​లో ఆండ్రీ రసెల్, కెప్టెన్ కార్తీక్ మినహా అందరూ విఫలమయ్యారు. ఓపెనర్లుగా వచ్చిన నిఖిల్ 7, లిన్ 20 పరుగులే చేశారు.

దిల్లీ బౌలర్లు

మరోసారి మెరిసిన రసెల్..

మరోసారి కోల్​కతా జట్టుకు అండగా నిలబడ్డాడు రసెల్. కేవలం 28 బంతుల్లో 62 పరుగులు చేసి జట్టు భారీ స్కోరు చేయడంలో కీలక పాత్ర వహించాడు. ఐపీఎల్​లో 1000 పరుగుల మైలురాయిని అధిగమించాడీ కరీబియన్ క్రికెటర్. 52 మ్యాచ్​ల్లో ఈ ఘనత సాధించాడు.

మరోవైపు కెప్టెన్ దినేశ్ కార్తీక్ నెమ్మదిగా ఆడినా.. 50 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. గత రెండు మ్యాచ్​ల్లో ఆకట్టుకున్న నితీశ్ రానా ఈ మ్యాచ్​లో ఒక పరుగే చేసి పెవిలియన్ బాట పట్టాడు.

దిల్లీ బౌలర్లలో హర్షల్ పటేల్ రెండు వికెట్లు తీశాడు. రబాడా, సందీప్, మోరిస్, అమిత్ మిశ్రా తలో వికెట్ తీశారు.

ABOUT THE AUTHOR

...view details