టీమ్ఇండియాకు భారీ జరిమానా విధించింది ఐసీసీ. మ్యాచ్ ఫీజులో 20శాతం కోత విధించినట్లు ప్రకటించింది. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో కోహ్లీ సేన 'స్లో ఓవర్రేట్' వేయడమే ఇందుకు కారణం.
"తొలి వన్డేలో భారత జట్టు ఆటగాళ్లు తమకు కేటాయించిన సమయం కన్నా ఎక్కువ సేపు ఓవర్లు వేశారు. ఈ కారణంగా టీమ్ఇండియాకు మ్యాచ్ ఫీజులో 20శాతం కోత విధించాము. ఇందుకు సారథి కోహ్లీ కూడా అంగీకరించాడు."