తెలంగాణ

telangana

ETV Bharat / sports

IND vs SL: సూర్య హాఫ్ సెంచరీ.. లంక లక్ష్యం 165

ప్రేమదాస స్టేడియం వేదికగా జరుగుతోన్న తొలి టీ20లో శ్రీలంకకు 165 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది టీమ్ఇండియా. సూర్యకుమార్ యాదవ్ హాఫ్ సెంచరీతో రాణించాడు. లంక బౌలర్లలో హసరంగ రెండు, చమీరా రెండు, చమీకా ఒక వికెట్ తీసుకున్నారు.

By

Published : Jul 25, 2021, 9:42 PM IST

Updated : Jul 25, 2021, 9:53 PM IST

india vs sri lanka
ఇండియా vs శ్రీలంక

ప్రేమదాస స్టేడియం వేదికగా శ్రీలంకతో జరుగుతోన్న తొలి టీ20లో టీమ్ఇండియా నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. కెప్టెన్ శిఖర్​ ధావన్​ (46), సూర్యకుమార్ యాదవ్ (50) రాణించారు. లంక బౌలర్లలో హసరంగ రెండు, చమీరా 2, చమీకా ఒక వికెట్ తీసుకున్నారు.

టాస్ ఓడి బ్యాటింగ్​కు దిగిన టీమ్ఇండియాకు తొలి బంతికే షాక్ తగిలింది. అరంగేట్ర మ్యాచ్​ ఆడుతున్న పృథ్వీ షా.. డకౌట్​గా వెనుదిరిగాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన సంజు శాంసన్​.. దూకుడుగా ఆడే ప్రయత్నం చేశాడు. కెప్టెన్​ ధావన్​తో కలిసి రెండో వికెట్​కు 51 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశాడు. ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీకి హసరంగ చెక్​ పెట్టాడు. ఓ అద్భుత బంతితో సంజును వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు.

అనంతరం బ్యాటింగ్​కు దిగిన సూర్యకుమార్​ యాదవ్​ దూకుడుగా ఆడాడు. ధావన్​తో కలిసి మూడో వికెట్​కు అర్ధ సెంచరీ భాగస్వామ్యం నమోదు చేశాడు. హాఫ్ సెంచరీకి చేరువైన గబ్బర్​.. ఓ భారీ షాట్​కు ప్రయత్నించి కరుణరత్నే బౌలింగ్​లో వెనుదిరిగాడు. కాసేపటికే 50 పరుగులు పూర్తి చేసుకున్న సూర్య.. తర్వాతి బంతికే ఔటయ్యాడు. తర్వాత వచ్చిన వారిలో ఇషాన్ ఫర్వాలేదనిపించాడు.

ఇదీ చదవండి:'ఒలింపిక్స్​లో 10 మంది.. పాక్​కు ఇది సిగ్గుచేటు'

Last Updated : Jul 25, 2021, 9:53 PM IST

ABOUT THE AUTHOR

...view details