తెలంగాణ

telangana

By

Published : May 3, 2021, 7:56 PM IST

ETV Bharat / sports

'పీఎం కేర్స్​'కు కాదు యూనిసెఫ్​ ద్వారా విరాళం: కమిన్స్

పీఎం కేర్స్​కు కాకుండా యూనిసెఫ్​ ద్వారా భారత్​కు విరాళం ఇవ్వనున్నట్లు బౌలర్ కమిన్స్ చెప్పాడు. ప్రస్తుతం ఇతడు ఐపీఎల్​ కోల్​కతా నైట్​రైడర్స్ తరఫున ఆడుతున్నాడు.

cummins
కమిన్స్​

కరోనా కట్టడిలో భాగంగా 50వేల డాలర్లు, భారత పీఎం కేర్స్​కు ఇస్తున్నట్లు ఆసీస్​ క్రికెటర్​ పాట్ కమిన్స్​ ఇటీవల ప్రకటించాడు. అయితే ఇప్పుడు తన ఆలోచనను మార్చుకున్నానని అన్నాడు. ఈ విరాళాన్ని యూనిసెఫ్​ ఆస్ట్రేలియా సాయంతో అందించనున్నట్లు సోమవారం తెలిపాడు.

క్రికెట్​ ఆస్ట్రేలియా కూడా భారత్​కు 50వేల డాలర్ల విరాళాన్ని ఇదే రీతిలో అందించనున్నట్లు తెలిపింది. ఈ నేపథ్యంలోనే కమిన్స్ నిర్ణయం తీసుకున్నాడు. ఈ ఆటగాడు విరాళం ప్రకటించిన తర్వాత చాలా మంది క్రికెటర్లు తమవంతుగా సాయం చేసేందుకు ముందుకు వచ్చారు.

ఇదీ చూడండి: 'పీఎం కేర్స్​'కు ఆసీస్​ పేసర్​ కమిన్స్ విరాళం

ABOUT THE AUTHOR

...view details