కరోనా కట్టడిలో భాగంగా 50వేల డాలర్లు, భారత పీఎం కేర్స్కు ఇస్తున్నట్లు ఆసీస్ క్రికెటర్ పాట్ కమిన్స్ ఇటీవల ప్రకటించాడు. అయితే ఇప్పుడు తన ఆలోచనను మార్చుకున్నానని అన్నాడు. ఈ విరాళాన్ని యూనిసెఫ్ ఆస్ట్రేలియా సాయంతో అందించనున్నట్లు సోమవారం తెలిపాడు.
'పీఎం కేర్స్'కు కాదు యూనిసెఫ్ ద్వారా విరాళం: కమిన్స్
పీఎం కేర్స్కు కాకుండా యూనిసెఫ్ ద్వారా భారత్కు విరాళం ఇవ్వనున్నట్లు బౌలర్ కమిన్స్ చెప్పాడు. ప్రస్తుతం ఇతడు ఐపీఎల్ కోల్కతా నైట్రైడర్స్ తరఫున ఆడుతున్నాడు.
కమిన్స్
క్రికెట్ ఆస్ట్రేలియా కూడా భారత్కు 50వేల డాలర్ల విరాళాన్ని ఇదే రీతిలో అందించనున్నట్లు తెలిపింది. ఈ నేపథ్యంలోనే కమిన్స్ నిర్ణయం తీసుకున్నాడు. ఈ ఆటగాడు విరాళం ప్రకటించిన తర్వాత చాలా మంది క్రికెటర్లు తమవంతుగా సాయం చేసేందుకు ముందుకు వచ్చారు.
ఇదీ చూడండి: 'పీఎం కేర్స్'కు ఆసీస్ పేసర్ కమిన్స్ విరాళం