తెలంగాణ

telangana

ETV Bharat / sports

పసుపు రంగు జెర్సీలతోనే ఆడనున్న శ్రీలంక

పసుపు - నీలిరంగు జెర్సీలతోనే మిగిలిన ప్రపంచకప్ మ్యాచ్​లు ఆడనుంది శ్రీలంక. ఇంగ్లాండ్​పై గెలిచిన శ్రీలంక ఆ రంగు జెర్సీలు తమ అదృష్టంగా భావిస్తోంది.

By

Published : Jun 27, 2019, 9:00 AM IST

శ్రీలంక

పసుపు - నీలిరంగు జెర్సీలతోనే మిగిలిన ప్రపంచకప్ మ్యాచ్​లు ఆడాలని నిర్ణయించింది శ్రీలంక జట్టు. దీనికి సంబంధించి ఐసీసీ అనుమతి కూడా సంపాదించింది. పసుపు - నీలిరంగు జెర్సీలు ధరించి ఇంగ్లాండ్​పై నెగ్గింది లంక జట్టు. ఫలితంగా ఆ జెర్సీలు తమ అదృష్టంగా భావిస్తోంది.

సాధారణంగా ముదురు నీలం రంగు జెర్సీలు ధరించే శ్రీలంక తర్వాతి మూడు మ్యాచ్​లకు పసుపు జెర్సీలను వాడనుంది.

ఇంగ్లాండ్​తో జరిగిన మ్యాచ్​లో శ్రీలంక 20 పరుగుల తేడాతో విజయం సాధించింది. మలింగ 4 వికెట్లు తీసి లంక గెలుపులో కీలకపాత్ర పోషించాడు. ఏడు మ్యాచ్​లు ఆడిన లంకేయులు ఒక్క మ్యాచులో మాత్రమే నెగ్గారు.

ఇది చదవండి: విండీస్ విధ్వంసకారులపై విరాట్ సేన విజృంభించేనా!

ABOUT THE AUTHOR

...view details