తెలంగాణ

telangana

ETV Bharat / sports

WC19: అంపైరింగ్​కు ఇయాన్​ గౌల్డ్​ వీడ్కోలు

ప్రపంచకప్​లో ప్రాతినిధ్యం వహించిన సీనియర్​ ఆటగాళ్లు కొంతమంది క్రికెట్​కు గుడ్​బై చెప్పేశారు. మరికొందరు రిటైర్మెంట్​ ప్రకటించే యోచనలో ఉన్నారు. ప్రస్తుతం ఇదే కోవలోకి  ఓ అంపైర్ కూడా​ చేరాడు. భారత్‌-శ్రీలంక మధ్య జరిగిన చివరి లీగ్​ మ్యాచ్‌కు అంపైరింగ్​ బాధ్యతలు నిర్వర్తించిన ఇంగ్లీష్​ అంపైర్‌ ఇయాన్‌ గౌల్డ్‌... తన 13 ఏళ్ల కెరీర్‌కు వీడ్కోలు చెప్పాడు.

By

Published : Jul 7, 2019, 9:17 AM IST

అంపైరింగ్​కు ఇయాన్​ గౌల్డ్​ వీడ్కోలు

ఇంగ్లాండ్​కు చెందిన ఇయాన్​ గౌల్డ్​ అంపైరింగ్​కు వీడ్కోలు పలికాడు. ప్రపంచకప్​లో భారత్​-శ్రీలంక పోరే గౌల్డ్​కు ఆఖరి మ్యాచ్​. 2006లో సౌతాంప్టన్‌లో ఇంగ్లండ్‌-శ్రీలంక మధ్య జరిగిన టీ20 మ్యాచ్‌లో అంపైర్‌గా అరంగేట్రం చేశాడు గౌల్డ్‌‌. అనంతరం నాలుగు ప్రపంచకప్​లలో అంపైర్‌గా వ్యవహరించాడు. కెరీర్​లో 74 టెస్టులు, 140 వన్డేలకు అంపైరింగ్​ బాధ్యతలు నిర్వర్తించాడు.

అంపైర్ ఇ​యాన్​ గౌల్డ్​

2011 ప్రపంచకప్​లో భారత్​-పాకిస్థాన్​ సెమీఫైనల్​కు కూడా ఆయన అంపైర్​గా పనిచేశాడు. క్రికెటర్​ అయిన గౌల్డ్... 1983 ప్రపంచకప్​లో ఇంగ్లాండ్​కు వికెట్​ కీపర్​గా సేవలందించాడు. ఇంగ్లండ్‌ తరఫున గౌల్డ్‌ 18 అంతర్జాతీయ వన్డేలు ఆడాడు. 1983 వరల్డ్‌కప్‌లో భారత్‌తో జరిగిన సెమీ ఫైనల్‌ మ్యాచ్‌ అనంతరం ఆటగాడిగా రిటైరయ్యాడు.

ABOUT THE AUTHOR

...view details