తెలంగాణ

telangana

ETV Bharat / sports

'పంత్ క్రీజులో నిలదొక్కుకుంటే ప్రత్యర్థి చిత్తే'​

టీమ్ఇండియా యువ బ్యాట్స్​మెన్​ రిషభ్​ పంత్​పై మాజీ క్రికెటర్​ లక్ష్మణ్​ ప్రశంసలు కురిపించాడు. రాబోయే రోజుల్లో టీ20ల్లో భారత జట్టుకు పంత్​ మ్యాచ్​ విన్నర్ అవుతాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. క్రీజులో నిలదొక్కుకుంటే ప్రత్యర్థి కెప్టెన్​ ఒత్తిడికి లోనవుతాడని పేర్కొన్నాడు.

By

Published : Mar 10, 2021, 8:10 AM IST

vvs laxman praised rishabh pant
పంత్ క్రీజులో నిలదొక్కుకుంటే ప్రత్యర్థి చిత్తే: లక్ష్మణ్​

టీ20 క్రికెట్​లో భారత్​కు రిషభ్​ పంత్ మ్యాచ్​ విన్నర్​ కాగలడని.. ఆ ఫార్మాట్​లో అతడికి ఎక్కువ అవకాశాలివ్వాలని మాజీ బ్యాట్స్​మెన్​ వీవీఎస్​ లక్ష్మణ్​ అభిప్రాయపడ్డాడు.

"ఐపీఎల్​లో దిల్లీ క్యాపిటల్స్​ తరఫున పంత్​ ఒత్తిడిలో రాణించడం, జట్టును గెలిపించడం చూశాం. ఎడమచేతి వాటం బ్యాట్స్​మెన్ అయిన అతడు క్రీజులో నిలదొక్కుకున్నాడంటే ప్రత్యర్థి కెప్టెన్ ఒత్తిడికి గురవుతాడు. భారత జట్టుకు అతడు గొప్ప ఆస్తి. ఒకట్రెండు ఇన్నింగ్స్​ల్లో విఫలమైనంత మాత్రానా అతడిపై ఒక అంచనాకు రారనే ఆశిస్తున్నా. ప్రపంచకప్​ను దృష్టిలో పెట్టుకుంటే అతడికి చాలా సమయం ఇవ్వొచ్చు. జట్టులో చోటు ఖాయం అన్న నమ్మకం కలిగితే పంత్​ సొంతంగా మ్యాచ్​లు గెలిపించగలడు" అని లక్ష్మణ్​ తెలిపాడు.

హార్దిక్​ పాండ్య, జడేజాలతో కలిసి పంత్​ పినిషర్​ పాత్రను పోషించగలడని లక్ష్మణ్​ అన్నాడు. ఇంగ్లాండ్​తో నాలుగో టెస్టులో శతకంతో భారత జట్టు విజయంలో పంత్​ కీలక పాత్ర పోషించాడు. ఇరు జట్ల​ మధ్య ఐదు మ్యాచ్​ల టీ20 సిరీస్​ ఈ నెల 12న ప్రారంభం కానుంది.

ఇదీ చదవండి:హెచ్​సీఏలో 'ఐపీఎల్'​ మంటలు- శివలాల్​కు అజార్ సవాల్​

ABOUT THE AUTHOR

...view details