న్యూజిలాండ్లో సుదీర్ఘ పర్యటననను విజయంతో ప్రారంభించింది టీమిండియా. మొత్తం 5 టీ20లు, 3 వన్డేలు, 2 టెస్టుల్లో కివీస్తో అమీతుమీ తేల్చుకోనుంది కోహ్లీసేన. మొదటి రెండు టీ20లను ఆక్లాండ్ ఈడెన్ పార్క్లో ఆడనుంది. అయితే ఈ మైదానంలో అన్ని కుర్చీలు బూడిద రంగులో ఉంటే ఒక్క కుర్చీ మాత్రం ఆకుపచ్చ రంగులో ఉండి, అందరిలోనూ ఆసక్తి కలిగిస్తోంది. అందుకో కారణం ఉంది.
2015 ప్రపంచకప్లో న్యూజిలాండ్ సెమీస్ చేరింది. దక్షిణాఫ్రికాతో మ్యాచ్. ఈ రెండు జట్లు అప్పటివరకు ఫైనల్ చేరలేదు. తొలిసారి తుదిపోరుకు అర్హత సాధించేందుకు ఇరుజట్లు పోటాపోటిగా తలపడ్డాయి. కానీ ఉత్కంఠభరితమైన ఈ మ్యాచ్లో చివర్లో విజయం కివీస్ను వరించింది.