తెలంగాణ

telangana

ETV Bharat / sports

స్టేడియంలో ఆ ఒక్క కుర్చీ రంగు వేరు.. ఎందుకంటే?

న్యూజిలాండ్-భారత్ మధ్య ఆక్లాండ్ వేదికగా రెండో టీ20 జరుగుతోంది. ఈ మైదానంలో ఓ కుర్చీ మాత్రమే ఆకుపచ్చ రంగులో ఉండి, అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. దీని వెనుక ఆ కారణం తెలుసుకోవాలంటే ఈ కథనం చదివేయండి.

By

Published : Jan 26, 2020, 1:35 PM IST

Updated : Feb 25, 2020, 4:22 PM IST

ఆకుపచ్చ కుర్చీ
ఆకుపచ్చ కుర్చీ

న్యూజిలాండ్​లో సుదీర్ఘ పర్యటననను విజయంతో ప్రారంభించింది టీమిండియా. మొత్తం 5 టీ20లు, 3 వన్డేలు, 2 టెస్టుల్లో కివీస్​తో అమీతుమీ తేల్చుకోనుంది కోహ్లీసేన. మొదటి రెండు టీ20లను ఆక్లాండ్​ ఈడెన్ పార్క్​లో ఆడనుంది. అయితే ఈ మైదానంలో అన్ని కుర్చీలు బూడిద రంగులో ఉంటే ఒక్క కుర్చీ మాత్రం ఆకుపచ్చ రంగులో ఉండి, అందరిలోనూ ఆసక్తి కలిగిస్తోంది. అందుకో కారణం ఉంది.

2015 ప్రపంచకప్​లో న్యూజిలాండ్​ సెమీస్ చేరింది. దక్షిణాఫ్రికాతో మ్యాచ్. ఈ రెండు జట్లు అప్పటివరకు ఫైనల్ చేరలేదు. తొలిసారి తుదిపోరుకు అర్హత సాధించేందుకు ఇరుజట్లు పోటాపోటిగా తలపడ్డాయి. కానీ ఉత్కంఠభరితమైన ఈ మ్యాచ్​లో చివర్లో విజయం కివీస్​ను వరించింది.

ఆ సిక్సుకు గుర్తుగా

ఈ మ్యాచ్​లో న్యూజిలాండ్ గెలవాలంటే చివరి రెండు బంతుల్లో ఐదు పరుగులు కావాలి. సఫారీ స్పీడ్ స్టార్ డేల్ స్టెయిన్ బౌలింగ్. కివీస్​ ఆటగాడు గ్రాంట్ ఎల్లియట్ బ్యాటింగ్​ చేస్తున్నాడు. మైదానంలో నిశబ్దం అలుముకుంది. ఇరుజట్లు ఫైనల్ పోరుకు అర్హత సాధించేందుకు ఆత్రుతగా ఎదురుచూస్తున్నాయి. కానీ సఫారీ జట్టు ఆశల్ని తుడిచేస్తూ, సిక్సు బాది కివీస్​కు అపురూప విజయాన్నందించాడు ఎలియట్. ఈ సిక్సు ల్యాండ్ అయిన కుర్చీని ఆకుపచ్చ రంగుతో ఓ జ్ఞాపకంగా మార్చారు. గ్రాంట్ ఎలియట్ కుర్చీగా నామకరణం చేశారు. ఈ కుర్చీ వెనుక ఓ ఫలకం కూడా ఉంటుంది.

ఇవీ చూడండి.. ఈ బ్యాట్స్​మన్ దురదృష్టం మాములుగా లేదు!

Last Updated : Feb 25, 2020, 4:22 PM IST

ABOUT THE AUTHOR

...view details