తెలంగాణ

telangana

ETV Bharat / sports

'కొన్నిసార్లు చివరి బంతి వరకు శ్రమించాలి'

అఫ్గానిస్థాన్​పై గెలిచినందుకు కోహ్లీ సంతృప్తి వ్యక్తం చేశాడు. ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్​లో భారత జట్టు అద్భుతంగా ఆడిందని అన్నాడు.

By

Published : Jun 23, 2019, 10:40 AM IST

'కొన్నిసార్లు చివరి బంతి వరకు శ్రమించాలి'

సౌతాంఫ్టన్ వేదికగా జరిగిన ఉత్కంఠ పోరులో అఫ్గానిస్థాన్​పై 11 పరుగుల తేడాతో గెలిచింది టీమిండియా. ఈ ప్రపంచకప్​లో తొలి మ్యాచ్​ ఆడిన షమి హ్యాట్రిక్​తో విజయాన్ని తెచ్చిపెట్టాడు. అనంతరం మీడియా సమావేశంలో ఈ గెలుపుపై కెప్టెన్ కోహ్లీ స్పందించాడు.

"ఈ మ్యాచ్​ మాకు చాలా ముఖ్యమైనది. పరిస్థితులు అనుకూలించనప్పుడు చివరి బంతి వరకు తీవ్రంగా శ్రమించాల్సి వస్తుంది. భారత్ బౌలింగ్ అమోఘం. అందివచ్చిన అవకాశాన్ని షమి సద్వినియోగం చేసుకున్నాడు. టాస్ గెలవగానే బ్యాటింగ్​ తీసుకుని భారీ స్కోరు చేయాలనుకున్నాం. పిచ్ నెమ్మదిగా ఉన్నందున 260-270 పరుగులు చేస్తే ప్రత్యర్థిని అడ్డుకోవచ్చు అనుకున్నాం. కానీ అఫ్గానిస్థాన్ ఒక సమయంలో మమ్మల్ని ఒత్తిడిలోకి నెట్టింది. చివరకు సమష్టిగా రాణించి విజయం సాధించాం. ఈ గెలుపు ఇచ్చిన విశ్వాసంతో రానున్న మ్యాచ్‌ల్లో మరింత బాగా ఆడతాం." -విరాట్ కోహ్లీ, టీమిండియా కెప్టెన్

అఫ్గాన్​పై గెలిచిన ఆనందంలో విరాట్ కోహ్లీ

ప్రస్తుతం పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉన్న కోహ్లీసేన.. జూన్ 27న మాంచెస్టర్ వేదికగా వెస్టిండీస్​తో తలపడనుంది.

ఇది చదవండి: అమ్మో అఫ్గాన్​- ఉత్కంఠ పోరులో భారత్​ గెలుపు

ABOUT THE AUTHOR

...view details