తెలంగాణ

telangana

ETV Bharat / sports

టెస్ట్​ క్రికెటర్లను గుర్తు పట్టడం మరింత సులువు

టెస్ట్​ మ్యాచ్​ల్లో ఆటగాళ్ల పేర్లు, నెంబర్లతో జెర్సీలు రానున్నాయి. ఆగస్ట్​లో ప్రారంభం కానున్న యాషెస్ సిరీస్​లో కొత్త జెర్సీలతో బరిలో దిగనున్నారు ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా క్రికెటర్లు.

By

Published : Jul 23, 2019, 5:52 PM IST

రూట్

టెస్టు క్రికెట్​లోనూ ఆటగాళ్లు పేర్లున్న జెర్సీలతో బరిలో దిగేందుకు రంగం సిద్ధమైంది. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మధ్య జరగనున్న యాషెస్ సిరీస్​ ఇందుకు వేదిక కానుంది. ఈ విషయాన్ని ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ట్విట్టర్లో పంచుకుంది. ఆ దేశ క్రికెట్ సారథి రూట్ ఫొటోను షేర్ చేసింది. ఇందులో తెలుపు జెర్సీపై పేరు, నెంబర్​తో కనిపించాడు రూట్.

ఈ ఏడాది ఆరంభంలోనే టెస్ట్ మ్యాచ్​ల్లోనూ క్రికెటర్ల జెర్సీలపై పేర్లు ఉండాలనే ప్రతిపాదన ముందుకొచ్చింది. ఫలితంగానే ఐసీసీ మార్పులు చేసింది. యాషెస్ సిరీస్​లో ఇరు దేశాల ఆటగాళ్లు తొలిసారిగా జెర్సీలపై తమ పేర్లతో కనిపించనున్నారు.

ఇంగ్లాండ్ వేదికగా ఆగస్టు 1 నుంచి సెప్టెంబరు 16 వరకు యాషెస్ సిరీస్​ జరగనుంది. ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్​ జట్లు ప్రపంచకప్​ తర్వాత తొలిసారిగా తలపడనున్నాయి. బుధవారం నుంచి ఐర్లాండ్​తో ఏకైక టెస్టు మ్యాచ్​ ఆడనుంది ఇంగ్లాండ్.

ఇది చదవండి: టీమిండియాతో తలపడే విండీస్​ టీ20 జట్టిదే

ABOUT THE AUTHOR

...view details