తెలంగాణ

telangana

ETV Bharat / sports

'పాక్​ మాటలు అసత్యాలు... మేము సిద్ధంగా ఉన్నాం'

పాక్​లో పర్యటించేందుకు నిరాకరించారు కొంత మంది శ్రీలంక క్రికెటర్లు. ఇందులో భారత్ హస్తం ఉందన్న పాకిస్థాన్​ ఆరోపణలకు చెక్​ పెట్టారు లంక క్రీడాశాఖ మంత్రి హరిన్​ ఫెర్నాండో. భద్రతా అంశాల కారణంగానే ఆటగాళ్లు వెనకడుగు వేశారని, పర్యటన రద్దు చేసుకోవట్లేదని ట్వీట్ చేశారు.

By

Published : Sep 11, 2019, 12:38 PM IST

Updated : Sep 30, 2019, 5:24 AM IST

పాక్​ మంత్రి ఆరోపణలపై శ్రీలంక క్రీడాశాఖ సీరియస్​

శ్రీలంక క్రికెట్​ జట్టులోని దాదాపు 10 మంది ఆటగాళ్లు పాకిస్థాన్​ పర్యటనకు వెళ్లేందుకు వెనకడుగు వేశారు. ఈ నిర్ణయం వెనుక భారత్ హస్తం ఉందన్న​ పాకిస్థాన్​ మంత్రి ఫవాద్​ హుస్సేన్​ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారులంక క్రీడాశాఖ మంత్రి హరిన్​ ఫెర్నాండో. భద్రత కారణాల దృష్ట్యా క్రికెటర్లు సందిగ్ధంలో ఉన్నారని ట్వీట్​ చేశారు.

"శ్రీలంక క్రికెటర్లను భారత్​ ప్రభావితం చేసిందన్న ఆరోపణల్లో నిజం లేదు. 2009లో జరిగిన బాంబు దాడి వల్లే జట్టులోని కొంత మంది ఆటగాళ్లు పాక్​ వెళ్లేందుకు నిరాకరించారు. వాళ్ల నిర్ణయాన్ని గౌరవిస్తున్నాం. ఎవరైతే పాకిస్థాన్​ వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారో వారినే ఎంపిక చేశాం. మా జట్టు బలంగా ఉంది. పాక్​ను వారి దేశంలోనే ఓడిస్తాం".
-- హరిన్​ ఫెర్నాండో, శ్రీలంక క్రీడాశాఖ మంత్రి

పాక్​లో ఆడేందుకు 10 మంది శ్రీలంక ఆటగాళ్లు అభ్యంతరం చెప్పగా.. ఇందుకు కారణం భారత్ అని విమర్శించారు పాకిస్థాన్ మంత్రి ఫవాద్ హుస్సేన్ చౌదరి. తమ దేశంలో లంక ఆటగాళ్లు ఆడితే ఐపీఎల్ కాంట్రాక్టులను రద్దు చేస్తామని భారత్​ బెదిరించిందని చెబుతూ ట్వీట్​ చేశారు.

పాకిస్థాన్​లో పర్యటించేందుకు సిద్ధమైన టీ-20 కెప్టెన్ మలింగ, మాజీ సారథి మ్యాథ్యూస్​తో కలిపి పది మంది ఆటగాళ్లు.. పాక్​లో ఆడకూడదని నిర్ణయించుకున్నారు. భద్రతా కారణాల దృష్ట్యా సిరీస్​ నుంచి తప్పుకుంటున్నట్లు వెల్లడించారు. ఈ నెల 27 నుంచి ఇరు జట్ల మధ్య మూడు టీ-20లు, మూడు వన్డేలు జరగాల్సి ఉన్నాయి.

ఇదీ చదవండి...

Last Updated : Sep 30, 2019, 5:24 AM IST

ABOUT THE AUTHOR

...view details