తెలంగాణ

telangana

ETV Bharat / sports

కోచ్​పై శ్రీలంక క్రికెట్ బోర్డు వేటు

లంక జట్టు కోచ్ చండికా హతురుసింగాపై సస్పెన్షన్ విధించింది శ్రీలంక క్రికెట్ బోర్డు. ఆగస్టు 14 నుంచి ప్రారంభం కానున్న కివీస్​ సిరీస్​కు అతడి స్థానంలో రమేశ్ రత్ననాయకేను నియమించింది. సస్పెన్షన్​కు గల కారణాలు లంక బోర్డు వెల్లడించలేదు.

By

Published : Aug 8, 2019, 8:47 AM IST

శ్రీలంక

శ్రీలంక హెడ్ కోచ్ చండికా హతురుసింగాపై వేటు వేసింది లంక క్రికెట్ బోర్డు. అతడి స్థానంలో తాత్కాలిక కోచ్​ను నియమించింది. రానున్న న్యూజిలాండ్ సిరీస్​లో హతురుసింగాకు బదులు లంక మాజీ బౌలర్ రమేశ్ రత్ననాయకేకు బాధ్యతలు అప్పగిస్తునట్లు బోర్డు ఛైర్మెన్ షమ్మీ సిల్వా తెలిపారు.

"న్యూజిలాండ్​ సిరీస్​లో హతురుసింగా ప్రమేయం ఉండదు. చట్టపరంగా ఈ అంశం కొలిక్కి వచ్చే వరకు తొలగింపునకు గల కారణాలు ఇప్పుడే ఏం చెప్పలేం" -షమ్మి సిల్వా, లంక క్రికెట్​ బోర్డు ఛైర్మెన్.

ఆగస్టు 14న న్యూజిలాండ్​తో టెస్టు సిరీస్​ ఆడనుంది శ్రీలంక. ఈ సిరీస్​కు హతురుసింగా దూరంగా ఉండాలని లంక క్రీడా మంత్రి హరీన్ ఫెర్నాండో ఈ నెల ప్రారంభంలోనే తెలిపారు. కొత్త కోచ్​కు అవకాశమివ్వాలని సూచించారు.

"హతురుసింగా కోచ్ పదవి నుంచి వైదొలగకపోతే అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. కోచ్​గా అతడికి నెలకు 40వేల డాలర్లు ముట్టజెప్పుతున్నాం.. విదేశీ కోచ్​లు చాలామంది అందులో సగం వేతనానికే చేస్తామంటున్నారు" -హరీన్ ఫెర్నాండో, శ్రీలంక క్రీడా మంత్రి

ప్రస్తుత సస్పెన్షన్​ అంశంపై హతురుసింగా స్పందించలేదు. ప్రపంచకప్​లో శ్రీలంక పరాభవంతో అతడు కోచ్ పదవి నుంచి తప్పుకోవాలని విమర్శలు వచ్చాయి. అయితే ఒప్పందం ప్రకారం ఇంకా 16 నెలలు సమయముందని, ఆ కాలాన్ని పూర్తి చేస్తానని ఇంతకుముందే చెప్పాడు హతురుసింగా.

ఇది చదవండి: రక్షణ గార్డ్ ఫొటోతో స్టెయిన్​కు వీడ్కోలు..!

ABOUT THE AUTHOR

...view details