తెలంగాణ

telangana

ETV Bharat / sports

శ్రీశాంత్​ ఇంట్లో అగ్నిప్రమాదం.. తప్పిన ప్రాణనష్టం

భారత క్రికెటర్​ శ్రీశాంత్​ నివాసంలో అగ్ని ప్రమాదం జరిగింది. శనివారం తెల్లవారుజామున రెండు గంటలకు ఘటన చోటుచేసుకుంది. వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసి ప్రాణ, ఆస్తి నష్టం తప్పించారు.

By

Published : Aug 24, 2019, 1:13 PM IST

Updated : Sep 28, 2019, 2:39 AM IST

శ్రీశాంత్​ ఇంట్లో అగ్నిప్రమాదం.. తప్పిన ప్రాణనష్టం

కేరళలోని కొచ్చిలో క్రికెటర్​ శ్రీశాంత్​​ ఇంటిలో అగ్నిప్రమాదం జరిగింది. తెల్లవారుజామున 2 గంటలకు ప్రమాదం చోటుచేసుకుంది. మంటలకు ఓ గది పూర్తిగా దగ్ధమైంది. ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఆ సమయంలో శ్రీశాంత్​ భార్య, పిల్లలు మాత్రమే ఇంట్లో ఉన్నారు. వారు క్షేమంగా బయటపడ్డారు. అగ్నిప్రమాద వార్త తెలుసుకున్న వెంటనే గాంధీనగర్​, త్రిక్కక్కరలోని అగ్నిమాపక దళాలు... సంఘటన స్థలానికి చేరుకుని మంటలు అదుపుచేశాయి.

భార్య భువనేశ్వరి, పిల్లలలో శ్రీశాంత్​

ఇటీవలే ఈ కేరళ పేసర్​పై జీవిత‌కాల నిషేధాన్ని ఏడేళ్లకు తగ్గించింది బీసీసీఐ. తాజాగా అంబుడ్స్‌మెన్ డీకే జైన్​ ఇచ్చిన ఆదేశాల‌తో 2020 ఆగస్టులో మళ్లీ క్రికెట్​ ఆడనున్నాడు శ్రీశాంత్​.

శ్రీశాంత్​ ఇంట్లో అగ్నిప్రమాదం

ఇదీ చదవండి...'స్వలాభం కోసం కొంతమంది నాకు మద్దతివ్వలేదు'

Last Updated : Sep 28, 2019, 2:39 AM IST

ABOUT THE AUTHOR

...view details