మహిళా టీ20 ప్రపంచకప్లో లీగ్ మ్యాచ్లు ముగిసిపోవడం వల్ల సెమీఫైనల్స్లో ఎవరెవరు తలపడతారనేది తేలింది. తొలి సెమీఫైనల్లో ఇంగ్లాండ్తో భారత్ పోటీ పడనుంది. రెండో సెమీస్లో దక్షిణాఫ్రికాతో ఆతిథ్య జట్టు ఆస్ట్రేలియా అమీతుమీ తేల్చుకోనుంది. రెండు మ్యాచ్లు సిడ్నీ వేదికగా గురువారమే జరగనున్నాయి. 2018, టీ20 ప్రపంచకప్ సెమీస్లోనూ ఇంగ్లీష్ జట్టుతోనే భారత్ తలపడింది. ఈ పోరులో ఇంగ్లాండ్ ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించింది.
టీ20 ప్రపంచకప్ : సెమీఫైనల్స్లో తలపడే జట్లివే
మహిళా టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్స్లో ఎవరెవరు అమీతుమీ తేల్చుకోనున్నారో ఖరారైంది. తొలి సెమీఫైనల్లో ఇంగ్లాండ్Xభారత్ తలపడనుండగా.. రెండో సెమీస్లో దక్షిణాఫ్రికాXఆస్ట్రేలియా జట్ల మధ్య పోరు జరగనుంది.
మంగళవారం జరగాల్సిన థాయ్లాండ్×పాకిస్థాన్, దక్షిణాఫ్రికా×వెస్టిండీస్ లీగ్ మ్యాచ్ల ఫలితం తేలలేదు. రెండు మ్యాచ్లు వర్షార్పణమయ్యాయి. పాక్తో జరిగిన మ్యాచ్లో థాయ్లాండ్ తొలుత నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది. ఆ తర్వాత వరుణుడు తన ప్రతాపం చూపించడం వల్ల పాక్ బ్యాటింగ్కు దిగలేదు. దక్షిణాఫ్రికా×వెస్టిండీస్ మ్యాచ్కు అసలు టాస్ కూడా సాధ్యం కాలేదు. ఫలితంగా గ్రూప్-బిలో దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్.. గ్రూప్-ఎలో భారత్, ఆసీస్ తొలి రెండు స్థానాల్లో నిలిచి సెమీస్కు చేరుకున్నాయి.
ఇదీ చూడండి :విరాట్ కోహ్లీని పొగడ్తలతోనే పడగొట్టేశారుగా!