తెలంగాణ

telangana

ETV Bharat / sports

హిట్ మ్యాన్ ఖాతాలో మరో రికార్డు

హిట్ మ్యాన్ రోహిత్ శర్మ మరో ఘనత సాధించాడు. టీ20 క్రికెట్లో 8 వేల పరుగులు సాధించిన మూడో భారత క్రికెటర్​గా గుర్తింపు పొందాడు.

By

Published : Apr 18, 2019, 11:06 PM IST

రోహిత్

భారత ఓపెనర్ రోహిత్‌ శర్మ మరో ఘనత సాధించాడు. టీ20 ఫార్మాట్‌లో ఎనిమిది వేల పరుగులు చేసిన మూడో భారత క్రికెటర్‌గా గుర్తింపు పొందాడు. దిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో హిట్ మ్యాన్ 30 పరుగులు నమోదు చేశాడు. ఈ క్రమంలో టీ20 క్రికెట్‌లో ఎనిమిది వేల పరుగుల మైలురాయిని చేరాడు.

సురేశ్‌ రైనా(8,216) తొలి స్థానంలో ఉండగా, విరాట్‌ కోహ్లి(8,183) రెండో స్థానంలో ఉన్నాడు. దిల్లీతో జరిగిన మ్యాచ్​లో మొదట బ్యాటింగ్ చేసిన ముంబయి జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 168 పరుగులు సాధించింది.

ఇవీ చూడండి.. ప్రపంచకప్​లో పాల్గొనే సఫారీ జట్టిదే

ABOUT THE AUTHOR

...view details