టీమ్ మేనేజ్మెంట్, జట్టు ఆటగాళ్ల మధ్య సమాచార సమన్వయం లోపించిందని అన్నాడు పాక్ పేసర్ మహ్మద్ ఆమిర్. బోర్డు విధానం వల్ల.. అలిసిపోయినప్పుడు కనీసం విరామం అడగడానికి కూడా క్రికెటర్లు భయపడుతున్నారని చెప్పాడు.
"ధైర్యం చేసి విరామం కావాలని అడిగితే వారిని జట్టు నుంచి తొలగించేస్తారన్న భయం ఆటగాళ్లలో ఉంది. మేనేజ్మెంట్, ఆటగాళ్ల మధ్య కమ్యునికేషన్ గ్యాప్ తొలిగిపోవాలని నా అభిప్రాయయం. ఇలా ఉండటం సరైనది కాదు. ఆటగాళ్లను బోర్డు అర్థం చేసుకోవాలి. "
-మహ్మద్ ఆమిర్, పాక్ క్రికెటర్