తెలంగాణ

telangana

మా ఫీల్డింగ్​ దారుణంగా ఉంది: కోహ్లీ

By

Published : Feb 11, 2020, 5:11 PM IST

Updated : Mar 1, 2020, 12:15 AM IST

మౌంట్​ మాంగనూయ్ వేదికగా న్యూజిలాండ్​తో జరిగిన మూడో వన్డేలో ఓటమిపాలైంది భారత్. సిరీస్​ను 0-3 తేడాతో కోల్పోయింది. అనంతరం మాట్లాడిన టీమిండియా సారథి విరాట్ కోహ్లీ.. తమ జట్టులో ఫీల్డింగ్ సరిగా లేదని అన్నాడు.

Virat Kohli
కోహ్లీ

మౌంట్​ మాంగనూయ్ వేదికగా న్యూజిలాండ్​తో జరిగిన మూడో వన్డేలోనూ భారత్ ఓడిపోయింది. నామమాత్ర మ్యాచ్​లోనూ ఓటమి పాలై, సిరీస్​ను 0-3 తేడాతో కోల్పోయింది. అనంతరం మాట్లాడిన టీమిండియా సారథి కోహ్లీ.. జట్టులో ఫీల్డింగ్​ ఏమాత్రం బాగాలేదని తెలిపాడు.

"మూడు వన్డేల్లోనూ ఫీల్డింగ్​లో తప్పులు చేశాం. అంతర్జాతీయ మ్యాచ్​ల్లో ఈ ఫీల్డింగ్​ సరికాదు. టీ20 సిరీస్​ తర్వాత న్యూజిలాండ్ బాగా పుంజుకుంది. ఈ సిరీస్ విజయానికి వారు అర్హులు."
-విరాట్ కోహ్లీ, టీమిండియా సారథి

కివీస్ పర్యటనలో ఐదు మ్యాచ్​ల టీ20 సిరీస్​ను టీమిండియా క్లీన్ స్వీప్ చేయగా.. వన్డే సిరీస్​ను న్యూజిలాండ్​ వైట్​వాష్ చేసింది. త్వరలో టెస్టు సిరీస్ ప్రారంభంకానుంది. తొలి మ్యాచ్​ ఈ నెల 21న వెల్లింగ్టన్ వేదికగా జరగనుంది. దీనిపైనా స్పందించాడు కోహ్లీ.

"టెస్టు ఛాంపియన్ షిప్ వల్ల ప్రతి మ్యాచ్ కీలకంగా మారింది. టెస్టుల్లో జట్టు సమతూకంగా ఉంది. టెస్టు సిరీస్​లో విజయం సాధిస్తామనే నమ్మకం ఉంది. సానుకూల దృక్పథంలో బరిలోకి దిగడం ముఖ్యం."
-విరాట్ కోహ్లీ, టీమిండియా సారథి

ఆఖరి వన్డేలో మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 296 పరుగులు చేసింది. లోకేష్ రాహుల్ (112) సెంచరీతో సత్తాచాటగా.. శ్రేయస్ అయ్యర్ (62) అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు. అనంతరం బరిలోకి దిగిన కివీస్ 47.1 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. నికోల్స్ (80), గప్తిల్ (66), గ్రాండ్​హోమ్ (58) అర్ధశతకాలతో మెరిశారు.

Last Updated : Mar 1, 2020, 12:15 AM IST

ABOUT THE AUTHOR

...view details