తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఐపీఎల్​లో ఖరీదైన కెప్టెన్​గా ధోనీ.. విలువ ఎంతంటే?

ఐపీఎల్​లో ఎక్కువ మొత్తం సంపాదించిన కెప్టెన్లలో ధోనీ టాప్​ ప్లేస్ సొంతం చేసుకున్నాడు. తర్వాతి స్థానాల్లో రోహిత్ శర్మ, కోహ్లీ నిలిచారు.

By

Published : Dec 10, 2020, 5:56 PM IST

MS Dhoni's 137 crore IPL salary puts him ahead of Rohit Sharma and Virat Kohli says a report
ఐపీఎల్​లో ఖరీదైన కెప్టెన్​ అతడే!

భారత కెప్టెన్​గానే కాక ఐపీఎల్​లోనూ అదరగొట్టిన ధోనీ.. ప్రపంచవ్యాప్తంగా చాలా గుర్తింపు తెచ్చుకున్నాడు. లీగ్​లో ఎక్కువ పారితోషికం తీసుకున్న కెప్టెన్​లలో అగ్రస్థానంలో నిలిచాడు. ఈ క్రమంలోనే రోహిత్ శర్మ, విరాట్​ కోహ్లీలను వెనక్కు నెట్టేశాడు.

"ధోనీ ఐపీఎల్​ ద్వారా మొత్తంగా రూ.137 కోట్లు సంపాదించాడు. గత మూడు సీజన్లలో దాదాపు రూ.45 కోట్లు అందుకున్నాడు. 2014-15లో రూ.12.5 కోట్లు, 2011 నుంచి 2013 వరకు ప్రతి ఏడాదికి రూ.8.2 కోట్ల పారితోషికం పుచ్చుకున్నాడు. కెరీర్​ ప్రారంభంలో 1.5 మిలియన్​ డాలర్లు తీసుకున్నాడు" అని ఇన్​సైడ్ స్పోర్ట్స్ మనీ బిల్​ నివేదికలో వెల్లడించింది.

విరాట్, రోహిత్​ ఇలా....

కెరీర్​ ప్రారంభంలో డెక్కన్​ ఛార్జర్స్​ తరపున ఆడిన రోహిత్ శర్మ.. తొలుత రూ.3 కోట్లు తీసుకున్నాడు. 2011-13 వరకు ఏడాదికి రూ.9.2 కోట్లు అందుకున్నాడు. తర్వాత నుంచి ధోనీతో సమంగా ఏడాదికి రూ.15 కోట్లు సంపాదించాడు. మొత్తంగా రోహిత్​ ఐపీఎల్​తో రూ. 131 కోట్లు సంపాదించాడు.

రోహిత్​ తర్వాత స్థానంలో ఉన్న కోహ్లీ రూ. 126 కోట్లు ఆర్జించాడు. 2017లో అధికంగా కోహ్లీనే రూ. 17 కోట్లు తీసుకోవడం విశేషం.

ఇదీ చదవండి:భారత్ పర్యటనకు ఇంగ్లాండ్.. 'మోతేరా'లో డే/నైట్ టెస్టు

ABOUT THE AUTHOR

...view details