తెలంగాణ

telangana

'భారత్​కు ఆ అవకాశం ఇస్తే.. ఐసీసీ బలహీనపడినట్లే!'

By

Published : Feb 27, 2021, 9:17 AM IST

ఇంగ్లాండ్​తో మూడో టెస్టు రెండు రోజుల్లోనే ముగియడం పట్ల తీవ్ర అసహనం వ్యక్తంచేశాడు ఆ జట్టు మాజీ క్రికెటర్ మైఖేల్ వాన్. మొతేరా లాంటి పిచ్​లను భారత్​ వంటి దేశాలు తయారు చేయడం వల్ల టెస్టు క్రికెట్​కు హానీ కలుగుతుందని అన్నాడు. ఐసీసీ బలహీనపడుతుందని అభిప్రాయపడ్డాడు.

More India is allowed to get away, more toothless ICC will look: Vaughan
'భారత్​కు ఆ అవకాశం ఇస్తే.. ఐసీసీ బలహీనపడినట్లే!'

టీమ్ఇండియాపై తన అక్కసు వెల్లగక్కాడు ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్. టెస్టు క్రికెట్​కు పనికిరాని పిచ్​లను తయారు చేసే వెసులుబాటు భారత్ లాంటి దేశాలకు కల్పించినంత కాలం.. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) అసమర్థంగా కనిపిస్తుందని అన్నాడు. మొతేరా పిచ్​పై జరిగిన డేనైట్​ టెస్టులో భారత్​ది అసలు గెలుపే కాదని విమర్శించాడు.

మైఖేల్ వాన్

"భారత్​ లాంటి శక్తిమంతమైన దేశాలకు ఇలాంటి(మొతేరా) పిచ్​లను తయారు చేసుకునే వీలు కల్పించే కొద్దీ ఐసీసీ మరింత బలహీనంగా కనిపిస్తుంది. టీమ్​ఇండియాకు నచ్చినట్టు చేసుకునే వెలుసుబాటు కల్పించడం వల్ల టెస్టు క్రికెట్​పై దుష్ప్రభావం పడుతోంది. మూడో టెస్టు భారత్​ గెలించింది. కానీ అది పెద్ద విజయం కాదు. ఈ మ్యాచ్​లో అసలు విజేతలు లేరు. అయితే అటువంటి పరిస్థితుల్లో ఇంగ్లాండ్​ కన్నా టీమ్​ఇండియా సమర్థవంతమైన నైపుణ్యాలు ప్రదర్శించడం వాస్తవం."

-మైఖేల్ వాన్, ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్

క్రికెట్ మంచి కోసం మాజీ క్రికెటర్​గా ఈ అంశాన్ని లేవనెత్తాల్సిన అవసరం, బాధ్యత ఉందని వాన్ అభిప్రాయపడ్డాడు. ఇలాంటి పిచ్​ల వల్ల ఆటగాళ్ల కెరీర్​లు దెబ్బతింటాయని, వారి ఉత్సాహాన్ని అవి నీరుగారుస్తాయని అన్నాడు.

మూడో టెస్టులో పిచ్​ స్పిన్​కు బాగా అనుకూలించిన వేళ ఇంగ్లాండ్​పై 10 వికెట్ల తేడాతోభారత్​ ఘనవిజయంసాధించింది. అయితే పిచ్​ను స్పిన్​కు అనుకూలంగా తయారు చేయడం పట్ల మాజీ క్రికెటర్లలో భిన్నాభిప్రాయలు వ్యక్తమయ్యాయి.

రీఫండ్​ కోరాలి..

రెండు రోజుల్లోనే మ్యాచ్​ ముగిసే పరిస్థితి తప్పాలంటే ప్రసారదారులు రీఫండ్ కోరాలని వాన్ భావించాడు. మూడో రోజుల పాటు ఎలాంటి ప్రసారాలు లేకున్నా నిర్వాహకులకు ప్రసారదారులు డబ్బులు చెల్లిస్తున్నారని, అలాంటి దుస్థితి పోవాలంటే వారు రీఫండ్ కోరాలని చెప్పాడు.

ఇంగ్లాండ్​ రొటేషనల్​ పాలిసీనీ వాన్​ విమర్శించాడు. బెయిర్​స్టోను తొలి రెండు టెస్టులకు పక్కనపెట్టి నేరుగా మూడో టెస్టులో ఆడించడాన్ని తప్పుబట్టాడు.

ఇదీ చూడండి:'ఇంగ్లాండ్​లో భారత్​ సాకులు చెప్పదు'

ABOUT THE AUTHOR

...view details