తెలంగాణ

telangana

By

Published : Jul 21, 2020, 6:26 AM IST

ETV Bharat / sports

ఇంగ్లాండ్​ పర్యటనకు మహమ్మద్​ ఆమిర్​ సిద్ధం

ఇంగ్లాండ్​ పర్యటనలో భాగంగా పాకిస్థాన్​ క్రికెట్​ జట్టులో చేరేందుకు సిద్ధమయ్యాడు పేసర్​ మహమ్మద్​ ఆమిర్​. ఇటీవలే వ్యక్తిగత కారణాల వల్ల ఈ సిరీస్​ నుంచి తప్పుకున్నప్పటికీ.. తిరిగి జట్టులో చేరాలని నిర్ణయించుకున్నాడు.

Mohammad Amir available to join Pakistan squad for England tour
మహమ్మద్​ ఆమిర్​

వచ్చే నెలలో పాకిస్థాన్​ క్రికెట్​ జట్టు ఇంగ్లాండ్​లో పర్యటించనుంది. పాక్​ ఆటగాళ్లు ఇప్పటికే ఇంగ్లాండ్​ చేరుకుని ప్రాక్టీస్​ మొదలుపెట్టారు. అయితే ఇటీవలే వ్యక్తిగత కారణాల వల్ల ఈ సిరీస్​ నుంచి తప్పుకున్న పేసర్​ మహమ్మద్​ ఆమిర్​.. తాజాగా జట్టులో చేరేందుకు సిద్ధమయ్యాడు. ఆమిర్​తో పాటు జట్టు నిర్వహకుల అభ్యర్థన మేరకు మహమ్మద్​ ఇమ్రాన్​నూ ఇంగ్లాండ్​ పంపించేందుకు అంగీకరించినట్లు పాకిస్థాన్ క్రికెట్​ బోర్డు(పీసీబీ) ప్రకటించింది.

ఈ పర్యటనలో భాగంగా ఆమిర్​, ఇమ్రాన్​ ఇద్దరూ సోమవారం కరోనా పరీక్షలు చేయించుకున్నారు. ఇంగ్లాండ్​ పర్యటనకు అర్హత సాధించాలంటే రెండు సార్లు కరోనా నెగిటివ్​గా తేలాలి. ఫలితాలు నెగిటివ్​గా వస్తే.. లాహోర్​లో బయో సెక్యూర్​ వాతావరణానికి తరలిస్తాం. అక్కడ బుధవారం రెండో దశలో పరీక్షలు నిర్వహిస్తాం.

పాకిస్థాన్​ క్రికెట్​ బోర్డు.

ఆమిర్​ జట్టులో చేరిన అనంతరం.. రిజర్వ్​ వికెట్​ కీపర్​-బ్యాట్స్​మన్​ రోహైల్​ నజీర్​ తప్పుకుంటాడని పీసీబీ స్పష్టం చేసింది. మరోవైపు క్రికెటర్​ షోయబ్​ మాలిక్.. ఆగస్టు రెండో వారం వరకు ఇంగ్లాండ్​ పర్యటనకు వెళ్లలేడని పేర్కొంది.

"భారత్​ అంతర్జాతీయ విమాన ప్రయాణాలపై జులై 31 వరకు నిషేధం విధించిన నేపథ్యంలో.. ఆగస్టు రెండో వారం వరకు షోయబ్​ ఇంగ్లాండ్​ చేరుకోవడం కష్టమే. ఆగస్టు 28న మాంచెస్టర్​లో ప్రారంభమయ్యే టీ20 సిరీస్​లో మాలిక్​ జట్టులో చేరతాడు. ఆప్పుడు జట్టు యాజమాన్యం ఒక ఆటగాడిని తొలగిస్తుంది" అని పీసీబీ తెలిపింది.

ఈ పర్యటనలో ఇంగ్లాండ్​-పాకిస్థాన్​.. మూడు టెస్టులతో పాటు టీ20 సీరీస్​లోనూ తలపడనున్నాయి. తొలి టెస్టు ఆగస్టు 5న ప్రారంభం కానుంది. ​

ABOUT THE AUTHOR

...view details