తెలంగాణ

telangana

ETV Bharat / sports

మూడో టీ20లో మార్పులతో టీమిండియా..!

ఇప్పటికే విండీస్​పై రెండు మ్యాచ్​ల్లో గెలిచి టీట్వంటీ సిరీస్​ కైవసం చేసుకుంది టీమిండియా. నామమాత్రపు మూడో టీ 20 మంగళవారం జరగనుంది. ఈ చివరి మ్యాచ్​ కోసం జట్టులో మార్పులు చేయనున్నట్టు తెలిపాడు భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ.

By

Published : Aug 5, 2019, 2:03 PM IST

కోహ్లీ

వెస్టిండీస్​పై రెండు టీ20ల్లోనూ గెలిచి సిరీస్​ కైవసం చేసుకున్న టీమిండియా.. నామమాత్రపు మూడో మ్యాచ్​ కోసం జట్టులో మార్పులు చేయనుంది. వెస్టిండీస్​లోని గయానా వేదికగా జరిగే ఈ పోరులో కొత్త వాళ్లకు అవకాశమివ్వనున్నట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ చెప్పాడు.

"చివరి మ్యాచ్​ గెలవడమే మా మొదటి ప్రాధాన్యత. అలాగే యువ ఆటగాళ్లకు అవకాశం కల్పించడమూ ముఖ్యం. తొలి రెండు టీ 20ల్లో ఆడని కొంతమందికి చివరి మ్యాచ్​లో తీసుకునే ఆలోచనలో ఉన్నాం." -విరాట్ కోహ్లీ, టీమిండియా సారథి

వెస్టిండీస్​ గయానాలో మ్యాచ్​ జరగనున్నట్టు, ప్రస్తుతం అక్కడికి బయదేరనున్నామని తెలిపాడు కోహ్లీ.

"శ్రేయస్ అయ్యర్, రాహుల్ చాహర్​ను ఆడించే ఆలోచనలో ఉన్నాం. దీపక్ చాహర్​కు అవకాశం దక్కినా ఆశ్చర్యపోనక్కర్లేదు. యాజమాన్యం పంత్​ను పక్కన పెట్టాలనుకుంటే అతడి స్థానంలో కేఎల్ రాహుల్ జట్టులోకి వస్తాడు." -విరాట్ కోహ్లీ, టీమిండియా సారథి

వర్షం పడకుండా ఉంటే విండీస్ లక్ష్యాన్ని ఛేదించేదే అని ఊహాగానాలు వస్తున్న తరుణంలో తను అలా అనుకోవట్లేదని తెలిపాడు విరాట్.

"నేను ఆ విషయం(లక్ష్య ఛేదనపై) గురించి ఆలోచించలేదు. బౌలింగ్​తో వారిని కట్టడి చేయాలనే అనుకున్నాం. అలాగే చేశాం. 26 బంతుల్లో 70 పరుగులు చేయడం కొంచెం కష్టంతో కూడుకున్న పనే." -విరాట్ కోహ్లీ, టీమిండియా సారథి.

లాడర్​హిల్​ వేదికగా జరిగిన రెండో టీ20లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్​ 5 వికెట్లు కోల్పోయి 167 పరుగులు చేసింది. అనంతరం విండీస్ 15.3 ఓవర్లో 4 వికెట్ల నష్టానికి 98 పరుగులు చేసింది. ఇంతలో వర్షం కురవడం వల్ల మ్యాచ్ ఆగిపోయింది. డక్​వర్త్​ లూయిస్ ప్రకారం 22 పరుగులతో గెలిచిన టీమిండియా.. 2-0 తేడాతో సిరీస్​ కైవసం చేసుకుంది.

ఇది చదవండి: రెండో టీ20లో రికార్డులే రికార్డులు..!

ABOUT THE AUTHOR

...view details