టెస్టు క్రికెట్లో 300 వికెట్ల మైలురాయి చేరుకున్న ఆరవ భారత బౌలర్గా, మూడో భారత పేసర్గా వెటరన్ పేసర్ ఇషాంత్ శర్మ అరుదైన ఘనత సాధించాడు. కపిల్ దేవ్, అనిల్ కుంబ్లే వంటి దిగ్గజాలు ఉన్న జాబితాలో చోటు దక్కించుకున్నాడు.
చెన్నై టెస్టు నాలుగో రోజు ఆటలో ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ డాన్ లారెన్స్ను ఔట్ చేయడం ద్వారా ఇషాంత్ ఈ ఫీట్ను అందుకున్నాడు. 98 టెస్టుల్లో ఇషాంత్.. 300 వికెట్ల మైలురాయి చేరుకున్నాడు. కుంబ్లే, కపిల్దేవ్, అశ్విన్, హర్భజన్ సింగ్, జహీర్ ఖాన్ ఇప్పటికే ఈ జాబితాలో ఉన్నారు. 2007లో టెస్టుల్లో ఇషాంత్ అరంగేట్రం చేశాడు