తెలంగాణ

telangana

ఐపీఎల్ తొలి మ్యాచ్​లో బౌలింగ్ ఎంచుకున్న చెన్నై

By

Published : Mar 23, 2019, 7:40 PM IST

Updated : Mar 23, 2019, 8:05 PM IST

చెన్నైలో మహేంద్ర సింగ్​ ధోనీ నేతృత్వంలోని చెన్నై సూపర్​ కింగ్స్​, విరాట్​ కోహ్లీ నాయకత్వంలోని బెంగళూరు రాయల్​ ఛాలెంజర్స్​ తలపడుతున్నాయి. మ్యాచ్​లో టాస్ గెలిచిన చెన్నై బౌలింగ్ ఎంచుకుంది. ప్రధానంగా ఐదుగురి పైనే అందరి దృష్టి నెలకొని ఉంది.

కాసేపట్లో ఐపీఎల్​ ప్రారంభం.. ఐదుగురిపైనే అందరి దృష్టి

చెన్నై సూపర్​ కింగ్స్, బెంగళూరు రాయల్​ ఛాలెంజర్స్ మధ్య పోరు
నాలుగోసారి టైటిల్​ చేజిక్కించుకోవాలని చెన్నై సూపర్​కింగ్స్ బరిలోకి దిగుతుంటే.. ఒక్కసారైనా కప్పు​ గెలవాలని రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు ఉవ్విళ్లూరుతోంది. అయితే ఈ రెండు జట్లు తమ ఆటగాళ్లపై భారీ ఆశలు పెట్టుకున్నాయి. ఈ మ్యాచ్​లో చూడదగిన ఆటగాళ్లను ఒకసారి పరిశీలిద్దాం.
  • సురేష్​ రైనా

ఐపీఎల్​లో తిరుగులేని ఆటగాళ్లలో రైనా ముందుంటాడు. 176 మ్యాచ్​లు ఆడి 34.37 సగటుతో 4,985 పరుగులు సాధించాడు. ఈసారి ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్​మెన్​పై సీఎస్​కే ఎక్కువ ఆశలే పెట్టుకుంది.

  • విరాట్​ కోహ్లీ

ప్రత్యర్థి ఎవరైనా చెలరేగి ఆడటంలో తనకు తానే సాటి. ఇప్పటికి 163 మ్యాచ్​లు ఆడిన ఈ సారథి 38.35 సగటుతో 4,948 పరుగులు సాధించాడు. ఇండియన్​ ప్రీమియర్​ లీగ్​లో అత్యధిక పరుగులు సాధించిన రెండో ఆటగాడిగా కొనసాగుతున్నాడు.

  • ఏబీ డివిలియర్స్​

ఈ దక్షిణాఫ్రికా ఆటగాడు స్టేడియంలో 360 డిగ్రీల్లో షాట్లు కొట్టగల సమర్థుడు. బౌలర్​ ఎవరన్నది సంబంధం లేకుండా విభిన్నమైన ఆటతీరుతో అలరించడం డివిలియర్స్​ ప్రత్యేకత. 141 మ్యాచ్​లు ఆడిన ఈ బెంగళూరు ఆటగాడు 3,953 పరుగులు సాధించాడు.

  • శామ్​ బిల్లింగ్స్​

ఇంగ్లండ్​ యువ ఆటగాడు శామ్​ బిల్లింగ్స్​ సీఎస్​కే తరఫున ఆడుతున్నాడు. డుప్లెసిస్​ జట్టుకు దూరం అవగా ఇతడికి అవకాశం లభించింది. అయితే తొలి మ్యాచ్​లో బరిలో దిగుతాడో లేదో చూడాలి.

  • శివమ్​ దూబే

దేశవాళీ మ్యాచ్​ల్లో అదరగొట్టిన ఈ యువ సంచలనం.. ఐపీఎల్​లో బెంగళూరు తరఫున ఆడుతున్నాడు. 5 కోట్ల భారీ మొత్తాన్ని చెల్లించి ఇతడిని దక్కించుకుంది ఈ ప్రాంఛైజీ. ఇపుడు అందరి చూపు ఈ యువ క్రికెటర్​పైనే.

Last Updated : Mar 23, 2019, 8:05 PM IST

ABOUT THE AUTHOR

...view details