తెలంగాణ

telangana

By

Published : Apr 13, 2021, 6:27 PM IST

ETV Bharat / sports

ఏడేళ్ల తర్వాత టెస్టుకు సిద్ధమైన టీమ్​ఇండియా

భారత్ మహిళల ఇంగ్లాండ్​ పర్యటన తేదీలు ఖరారయ్యాయి. ఇందులో భాగంగా టెస్టు, తలో మూడు వన్డేలు, టీ20లు ఆడనున్నాయి ఇరుజట్లు.

Indian women to play one-off historic Test against England in June-July
టీమ్​ఇండియా మహిళలు

దాదాపు ఏడేళ్ల విరామం తర్వాత టెస్టు ఆడేందుకు టీమ్​ఇండియా మహిళా జట్టు సిద్ధమైంది. ఈ ఏడాది జూన్​లో ఇంగ్లాండ్​ పర్యటనకు వెళ్లనున్న మన అమ్మాయిలు.. టెస్టుతో ఈ టూర్​ను ప్రారంభించనున్నారు. దీనితో పాటే వన్డే, టీ20ల్లోనూ తలపడనున్నారు. 2014లో చివరగా టెస్టు ఆడింది భారత మహిళా బృందం.

పర్యటన షెడ్యూల్:

జూన్ 16-19 మధ్య ఏకైక టెస్టు, బ్రిస్టల్ కంట్రీ గ్రౌండ్ వేదికగా జరగనుంది. అనంతరం జున్ 27, 30, జులై 3 తేదీల్లో మూడు వన్డేలు.. జులై 9, 11, 15 తేదీల్లో మూడు టీ20లు ఆడనున్నాయి ఇరుజట్లు.

ఇది చదవండి:'ఆసియా కప్' మళ్లీ వాయిదా.. 2022లోనే!

ABOUT THE AUTHOR

...view details